సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడి ల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంగీత, రాజేంద్ర ప్రసాద్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి, హరితేజ తదితరులు నటిస్తుండగా సీనియర్ నటి విజయశాంతిసినిమా ద్వారా చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. 

 

అయితే సినిమాలోని సాంగ్స్ పెద్దగా బాగోలేవంటూ తమ హీరో సినిమాపై కొందరు పనిగట్టుకుని మరీ సోషల్ మీడియా మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయపడుతున్నారు. నిజానికి తమ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న అలవైకుంఠపురములో సాంగ్స్ కూడా బాగున్నాయని, వాటికి కూడా ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించిందని, అలానే తాము రెండు సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బన్నీ ఫ్యాన్స్ పేరుతో కొందరు లేనిపోని విధంగా సరిలేరు నీకెవ్వరు పై చేస్తున్న తప్పుడు ప్రచారాలకు కూడా రేపు సినిమానే పూర్తిగా సమాధానం చెప్తుందని అంటున్నారు. 

 

అయితే ఈ విషయమై కొందరు సినిమా విశ్లేషకులు మాట్లాడుతూ, ఒకే సీజన్ లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే వారి అభిమానుల మధ్య కొద్దిపాటి విబేధాలు రావడం గతంలో కూడా చాలా సార్లు జరిగిందని, అయితే తమకు అందుతున్న సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు. మరి సంక్రాంతి కానుకగా కేవలం ఒక రోజు గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాల్లో ఏది ఎంతమేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి......!!   

మరింత సమాచారం తెలుసుకోండి: