ఉయ్యాలా  జంపాలా చిత్రం తో  సినిమాల్లోకి  ఎంట్రీ ఇచ్చాడు  యంగ్ హీరో రాజ్ తరుణ్. ఈచిత్రం సూపర్  హిట్ అయ్యింది. ఈసినిమా తరువాత రాజ్ తరుణ్సినిమా చూపిస్తమావ , కుమారి 21ఎఫ్  రూపంలో మరో రెండు హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. దాంతో రాజ్ తరుణ్ ఫుల్ బిజీ అయ్యాడు. వరసగా  సినిమాలు చేసుకుంటూవెళ్లిపోయాడు. అయితే కథలకు ప్రాధాన్యత ఇచ్చి  జాగ్రత్తగా  సినిమాలు చేసుకుంటే ఈహీరో కంటూ  ఇప్పటికీ ఓ మంచి గుర్తింపు  ఉండేది. కానీ  అవకాశం వచ్చిందని సినిమాలు చేసుకుంటూ  వెళ్ళిపోయాడు గత రెండేళ్ల నుండి ఒక్క హిట్టు కూడా లేదు. వరుసగా  7సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.  ఇన్ని పరాజయాలు  చవి చూశాక రాజ్ తరుణ్ కు ఏమనిపించిందో ఏమో  ఓ  6-7 నెలల వరకు ఇంట్లో నుండి బయటికి రాలేదు. 
 
ఇక  ఇటీవల  దిల్ రాజు ఆఫీస్ నుండి పిలుపు రావడంతో  రాజ్ తరుణ్ మళ్ళీ కెమెరా ముందుకొచ్చి తాజాగా ఓ  సినిమా ను పూర్తి చేశాడు.  అదే ఇద్దరి లోకం ఒకటే. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటించగా  కృష్ణా తెరకెక్కించాడు.  సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం  డిసెంబర్ 25న  ప్రేక్షకులముందుకు రానుంది. అయితే దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా అయినా  ఈచిత్రానికి ఎలాంటి బజ్ రావడం లేదు.
 
ఇదిలావుంటే  రాజ్ తరుణ్ ప్రస్తుతం  గుండె జారి గల్లంతయ్యిందే ఫేమ్  విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రంలో నటిస్తున్నాడు.  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా   మాళవిక నాయర్  కథానాయికగా నటిస్తుంది.  ఈసినిమాను  పూర్తి చేసిన తరువాత రాజ్ తరుణ్, బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ  డ్రీం గర్ల్ రీమేక్ లో నటించనున్నాడు.  ఈచిత్రాన్ని  సురేష్ ప్రొడక్షన్స్  నిర్మించనుంది.  ఇక అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ , గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లలో కూడా రాజ్ తరుణ్  సినిమాలు  చేయాల్సివుంది. అలా జయాపజయాలతో సంబంధం లేకుండా  వరసగా సినిమా లకు కమిట్ అవుతూ ఫుల్ జోష్ లో వున్నాడు రాజ్  తరుణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: