అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అప్పటి వరకు తెలుగులో చూపించడానికి ఎవరూ ధైర్యం చేయని సీన్లు, బోల్డ్ సన్నివేశాలతో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాపై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ సినిమా మాత్రం విజయం అందుకోవడం గమనార్హం. ఈ సినిమాతోనే హీరో విజయ్ దేవరకొండకి స్టార్ హీరో రేంజ్ వచ్చిందని చెప్పవచ్చు.

 

 

తెలుగులో సూపర్ హిట్ సాధించిన ఈ సినిమాని " కబీర్ సింగ్" పేరుతో బాలీవుడ్ లో రీమేక్ అయిన విషయం తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆయన కెరిర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు మూడు వందల కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా తెలుగులో సినిమా తీస్తాడని అందరూ అనుకున్నారు.

 

 

కానీ సందీప్ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమా తీయడానికే ఆసక్తి చూపిస్తున్నాడు. బాలీవుడ్ నిర్మాతలు సందీప్ తో సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే మరి కొద్ది రోజుల్లో సందీప్ సినిమా తెరకెక్కబోతుంది. క్రైమ్ జోనర్ లో తెరకెక్కే ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందట. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే ఈ సినిమాని ‘కబీర్ సింగ్’ చిత్ర నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతానిలు నిర్మించనున్నారట.

 

వీరితోపాటే సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. మరి ఈ సినిమా కూడా కబీర్ సింగ్ లాంటి విజయం సాధిస్తుందో లేదో చూడాలి. దీని తర్వాతైనా సందీప్ తెలుగులో సినిమా చేస్తాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: