టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ.   సినీయర్ ఎన్టీఆర్ వారసులుగా తాతమ్మకల సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు.  ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ములు కలిసి రామ్ రహీం సినిమాలో నటించారు.  అదే సమయంలో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేయడంతో తండ్రికి సహాయకుడిగా హరికృష్ణ రాజకీయాల్లోకి వెళ్లారు.  ఇక నందమూరి బాలకృష్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు.  ప్రస్తుతం ఆయన నటిస్తున్న రూలర్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇక హరికృష్ణ తనయులు నందమూరి కళ్యాన్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు హీరోలుగా వస్తున్నారు.  కళ్యాన్ రామ్ నిర్మాత, హీరోగా నటిస్తున్నారు.

 

ఇక ఎన్టీఆర్ వరుస విజయాలతో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు కెరీర్ పరంగా ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.  అందుకే ఆయన నటించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. తాజాగా మరో విషయంలో కూడా ఎన్టీఆర్ ఇలాంటి తగు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆ మధ్య కారు డ్రైవింగ్ చేస్తూ తారక్‌కు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే కదా... అంతే కాదు కారు యాక్సిడెంట్ లో తన సోదరుడు జానకిరామ్, తండ్రి హరికృష్ణ దుర్మరణం పొందారు. అప్పట్లో ఎన్టీఆర్ ఫ్యామిలీకి ప్రయాణాలు అచ్చి రావడం లేదని అపోహలు కూడా వచ్చాయి.

 

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన కుటుంబ భద్రత కోసం గతంలో తన అన్నకు, తండ్రికి జరిగిన ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని సెన్సేషన్ నిర్ణయం తీసుకున్నారట.  ఎంతో అనుభవం ఉన్న ఒక డ్రైవర్‌ను పెట్టుకున్నాడట. ముఖ్యంగా ఎన్టీఆర్ దగ్గర పనిచేసే డ్రైవర్ ఇంత వరకు ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదట.  అయితే ఆ డ్రైవర్ కి ఇప్పటి వరకు మద్యం అలవాటు లేదట.. మొత్తానికి వర్ విషయంలో ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది.  ఇక డ్రైవర్ సాలరీ విషయంలో ఎమాత్రం కాంప్రమైజ్ కాకుండా.. రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం ఇస్తున్నట్టు టాక్. ఏమైనా తన ప్రాణాలను సురక్షితంగా కాపాడే డ్రైవర్‌కు ఎన్టీఆర్ ఆ మాత్రం ఇచ్చుకోవడం సబబే అంటున్నారు ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: