'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న “RRR” సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళి తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకోవటంతో 'RRR'  సినిమా విషయంలో ప్రపంచ సినిమా ప్రేక్షకులు ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఆసక్తిగా గమనిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి ఎవరితో చేస్తారు అన్న దాన్ని విషయంలో సస్పెన్స్ గా ఉన్న సమయంలో ఎప్పటిలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు బడా హీరోలు అయినా ఎన్టీఆర్ మరియు చరణ్ తో సినిమా ఓకే చేయటంతో అందరూ షాక్ తిన్నారు. బాహుబలి వంటి ప్రపంచ స్థాయి సినిమా తర్వాత అందరూ రాజమౌళి బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలతో సినిమాలు మొదలు పెడతారని అనుకోవటం జరిగింది.

 

కానీ అనూహ్యంగా రాజమౌళి తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమా చేయడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న క్రమంలో రెండు బడా హీరోలు ముఖ్యంగా నందమూరి వర్సెస్ మెగా అన్నట్టుగా వాతావరణం ఉండే ఇలాంటి హీరోలతో రాజమౌళి rrr చేయడంతో ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీ లోనే భారీ మల్టీ స్టారర్ సినిమా అని ఇప్పటికే పేరు సంపాదించుకోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా గురించి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో rrr సినిమా కంప్లీట్ అయ్యేవరకు ఎటువంటి సినిమా చేయడం లేదని జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుల దగ్గర వాపోయారు అని... అదేవిధంగా kgf డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా ఉన్నట్లు వార్తలు అప్పట్లో గట్టిగా వినబడ్డాయి ఇదే సినిమాని వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

 

అయితే ఇటువంటి విషయంలో వైజయంతి మూవీస్ కూడా తారక్ తో సినిమాని ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవ్వగా తారక్ అశ్వినీదత్ తో మాట్లాడి 'RRR' రిలీజ్ వరకు హడావుడి వద్దని క్లారిటీగా చెప్పేశాడట. మొత్తంమీద చూసుకుంటే kgf డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ అయినట్లు అర్థమవుతుంది. దీంతో 'RRR' సినిమా తర్వాత kgf డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ అయినట్లు అభిమానులు డిసైడ్ అవుతూ మీసం మెలేస్తున్న నందమూరి ఫాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: