సోషల్ మీడియా సంచలన తార శ్రీరెడ్డి తాజాగా ఒక మార్ఫింగ్ ఫోటోని తన ఫేసుబుక్ ఖాతాలో షేర్ చేసి కొన్ని కామెంట్లను చేసింది. కొంతమంది పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు అతని ఇమేజ్ ని పాడుచేసే ఉద్దేశంతో పవన్ ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు. గతంలో అటువంటి పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫొటోస్ ని శ్రీ రెడ్డి తన ఖాతాలో పోస్ట్ చేసి అవమానకర కామెంట్లను చేసిన విషయం తెలిసిందే.

ఈసారి ఏం పోస్ట్ చేసిందంటే... ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేసారు. ఆ దీక్ష అనంతరం రాజమండ్రి ఎయిర్ పోర్టు కు చేరుకుందామని బయలుదేరారు. కానీ మార్గం మధ్యలోనే విమానం కాస్త ఆలస్యంగా వస్తుందని తెలుసుకున్నారు పవన్. ఆ సందర్భంలోనే తన అభిమాని ఇంటి బయట మెట్ల ముందు ఉన్న ఫ్లోర్ పై పడుకున్నారు. రెండు దిండ్లు తప్ప మరేమి యూజ్ చేయకుండా కటిక నేలపై సామాన్య వ్యక్తిలా పడుకున్న పవన్ కళ్యాణ్ ఫోటో తెగ వైరల్ అయింది. ఆ ఫోటోని, అప్పట్లో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ నిరసిస్తూ హైదరాబాద్‌ ఫిల్మ్ ఛాంబర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేసినప్పటి శ్రీరెడ్డి ఫోటోని కలిపి ఒక మార్ఫింగ్ ఫోటోని క్రియేట్ చేసారు పవన్ వ్యతిరేకులు.


ఇక ఆ మార్ఫింగ్ ఫోటో చివరికి శ్రీరెడ్డి దగ్గరికి వచ్చింది. ఒరిజినల్ పిక్ లో పవన్ పిల్లోపై పడుకుంటే.. మార్ఫింగ్ ఫోటోలో పవన్ శ్రీరెడ్డి ఒళ్లో పడుకున్నాడు. ఇక శ్రీరెడ్డి ఈ ఫోటో ని పోస్ట్ చేసి...  ‘ఏందిరా ఇది? మీ బొంద పెట్ట. నా ఒళ్లో పవన్ కళ్యాణ్‌ని పడుకోబెట్టారేంట్రా నాయనో.. నన్ను కొంపతీసి ఐదో పెళ్లాం అంటే.. మా బాస్ దగ్గర నా పరువేం కావాలి?’ అంటూ రాసింది.

వాస్తవానికి, పవన్ కు ముగ్గురు భార్యలే ఉన్నారని.. మరో పెళ్ళైతే శ్రీరెడ్డి నాలుగవ భార్య అవుతుందని ఐదోవది కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాలుగవ భార్య మరొకరు ఉన్నారంటూ మరికొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: