టాలీవుడ్ క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ గతంలో తెరకెక్కించిన గోవిందుడు అందరివాడేలే సినిమాకి ఓ సమస్య వచ్చి అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. రామ్ చరణ్ కి తాత పాత్రలో తమిళ సీనియర్ నటుడు రాజ్ కిరణ్ సెట్ కాకపోవడంతో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో రీప్లేస్ చేశారు. అయితే తాతతో మనవడి సన్నివేశాలు కొంతవరకూ షూట్ చేశాక మధ్యలో రీప్లేస్ చేయడంతో ఆ సీనియర్ నటుడు ఎంతో ఫీలయ్యారు. ఇంకెప్పుడు తెలుగు సినిమాలలో నటించనని కూడా అనుకున్నారు. ఇప్పుడు ఇంచుమించు అదే తరహా సమస్య బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి ఎదురైంది.

 

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సూర్యవంశీ' సినిమాకి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం టాకీపార్ట్ చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే ఈ సినిమా నుంచి అర్థాంతరంగా సీనియర్ నటి నీనా గుప్తా తప్పుకోవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో హీరో అక్షయ్ కుమార్ కి తల్లిగా నీనా గుప్తా ముఖ్య పాత్ర పోషించారు. కొన్ని రోజులు నీనాపై పలు కీలక సన్నివేశాల్ని కూడా షూట్ చేశారు. అయితే నీనా.. పాత్రకు సినిమాకు ఎలాంటి సింక్ అవడంలేదట. దీంతో దర్శకుడు నీనా పాత్ర విషయంలో మనసు మార్చుకున్నారట.

 

ఈ విషయాన్ని నీనా తో చెప్పేందుకు రోహిత్ శెట్టి ఆలోచిస్తున్న విషయాన్ని నీనా అర్థం చేసుకున్నారు. సినిమాకి ఉపయోగపడని డమ్మీ పాత్రలో నటించడం ఇష్టంలేక ఆమె అర్థాంతరంగా సినిమా నుంచి తప్పుకున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా నుంచి తప్పుకున్న నీనా గుప్తాకు తన నెక్స్ట్ మూవీలో అవకాశం ఇస్తానని రోహిత్ మాటిచ్చారట. ఇక ఈ క్లాష్ చూస్తే ఇంతకుముందు కృష్ణ వంశీ గోవిందుడు అందరివాడేలా సినిమాకి ఇలాంటి సమస్య ఎదురైతే అప్పట్లో సీనియర్ నటుడు రాజ్ కిరణ్ స్థానంలో ప్రకాష్ రాజ్ ని తీసుకున్న సంగతి తెలిసిందే.

 

నీనా గుప్తా నాలుగు దశాబ్ధాల సీనియారిటీ ఉన్న నటి. 1982లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా -  ఢీల్లీలో నటశిక్షణ పొంది సినిమా రంగంలో ఎంటరయ్యారు. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో క్యారెక్టర్ నటిగా పాపులారిటిని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్న 'శుభ్మంగల్ జ్యాదా సావధాన్' సినిమాలో నీనా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పంగ అనే మరో సినిమాలోనూ నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: