'మిర్చి' భామ రిచా గంగోపాధ్యాయ్ అమెరికా అబ్బాయిని వివాహమాడింది. ప్రస్తుతం ఈ కొత్త జంట ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈమె రానా దుగ్గుబాటి సరసన 'లీడర్' సినిమాలో నటించి టాలీవుడ్ లో అరంగేట్రం చేసారు. రిచా మిరపకాయ్, సారొచ్చారు, నాగవల్లి, మిర్చి సినిమాల్లో కూడా నటించారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం తనకి నటించడం ఇష్టంలేదని చెప్పి పై చదువు కోసం వాషింగ్టన్, అమెరికా వెళ్లారు. అక్కడి బిజినెస్ స్కూల్ లో ఎంబీఏ చదువుతున్నపుడు తన క్లాస్ మెట్ జో తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఎంతగా అంటే ఈ ఏడాది జనవరి లో రిచా జో తో నిశ్చితార్థం చేసుకుంది. ఆ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియపరిచింది.
https://mobile.twitter.com/richyricha/status/1085235499453669376

కాగా, తాజాగా రిచా విహహం జో తో క్రిస్టియన్‌, హిందూ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగిందని సమాచారం. వరుడు జో, వధువు రిచా కుటుంబ సభ్యుల నడుమ వీరిద్దరు ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోస్ సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. రిచా తన ఆఫీసియల్ అకౌంట్ లో పోస్ట్ చేయలేదు కానీ వారి మ్యారేజ్ ఫొటోస్ ఇంటర్నెట్ తెరపై ప్రత్యక్షమయ్యాయి.

https://mobile.twitter.com/klapboardpost/status/1206963052819599360

మాజీ  బ్యూటిఫుల్ హీరోయిన్ రిచా తెలుగుతో పాటు తమిళం, బెంగాళీ మూవీల్లో కూడా నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను అలరించారు. కానీ కొన్నేళ్ల తరువాత సెకండ్ హీరోయిన్‌గా ముద్రపడటం, సినీ ఆఫర్స్ సన్నగిల్లటంతో మూవీస్ లకు దూరంగా ఉంటున్నారు. తాను సినిమాల్లోకి మళ్లీ రానని, కేవలం వ్యక్తిగత జీవితంపైనే దృష్టి సారించినట్లు ఎంబీఏ చేస్తున్న సమయంలోనే రిచా తెలిపారు.

https://mobile.twitter.com/syeraaupdates/status/1206920694203682817

 

మరింత సమాచారం తెలుసుకోండి: