ప్రస్తుతం టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా భారీ మల్టి స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో భారీ లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కి చెందిన దిగ్గజ నటులు నటిస్తున్నారు.

 

హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. 
ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా పై టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల ఈ సినిమాలో విలన్స్ గా నటిస్తున్న వారి పోస్టర్లను రిలీజ్ చేసిన సినిమా యూనిట్, అతి త్వరలో హీరోలిద్దరి ఫస్ట్ లుక్స్ తో పాటు, సినిమా పూర్తి టైటిల్ ని కూడా రిలీజ్ చేసేందుకు ముహూర్తం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

 

సరిగ్గా 2020 వ సంవత్సరం తొలి రోజైన జనవరి 1న వాటిని రిలీజ్ చేస్తే బాగుంటుందని, అందుకే ఇన్నాళ్లు కూడా వెయిట్ చేసినట్లు సమాచారం. ఇటీవల బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత తన పేరుని మరియు టాలీవుడ్ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి, ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంకెంతటి పేరు ప్రఖ్యాతలు గడిస్తారో చూడాలి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమాను 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: