మనం ఏదైనా చెప్పాలనుకున్నది చెప్పడానికి సులువుగా ఉపయోగ పడే ప్రదేశం సోషల్ మీడియా.. ఎక్కడా ఎవరికి హద్దులు ఉండవు చెప్పాలనుకుంటే చెప్పవచ్చు.. కొంతమంది ఈ వేదికను మంచి కోసం వాడితే మరికొందరు మాత్రం వెరేవల్లను విమర్శించడానికి వాడుతుంటారు.. అలా ప్రపంచంలో ఈ సోషల్ మీడియా రాజ్యమేలుతుంది...

 

అసలు విషయానికొస్తే... వివాదాస్పద నటి శ్రీరెడ్డీ ఎవరొకరిని గెలక కుండా ఉందన్న విషయం చూడాల్సిందే.. ప్రతి చిన్న విషయానికి కూడా సోషియల్ మీడియాలో వైరల్ అయ్యేలా పోస్టులు పెట్టీ రెచ్చిపోతుంది.అలా ఈ అమ్మడు మరింత పాపులర్ అయ్యారని చెప్పాలి.. అందుకే వివాదాస్పద నటి అందరిచేత ట్రొల్స్ వేయించుకుంది...

 

చెన్నైలో ఉంటూ ఏపీ, తెలంగాణలో ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులపై సోషల్ మీడియా ద్వారా విరుచుకుపడుతూ ఉంటుందామె.ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే బురదలో రాయేసినట్టేనని తిట్టించుకుంటున్నవారు కూడా సైలెంట్‌గా ఉండిపోతున్నారు. కాకపోతే, వాళ్ల ఫ్యాన్స్ వకాల్తా పుచ్చుకుని పోరాడుతున్నారనుకోండి. అయినప్పటికీ శ్రీరెడ్డి మరింత రెచ్చిపోతోంది తప్ప వెనక్కి తగ్గట్లేదు. తాజాగా ఆమె తన ఫేస్‌బుక్ పేజ్‌లో లైవ్ వీడియో చేసింది. సుమారు 20 నిమిషాల పాటు చేసిన ఈ లైవ్‌లో మరోసారి ఎప్పటిలానే తనకు సంబంధంలేని రాజకీయాల్లో తలదూర్చి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని పొగుడుతూ.. ఆయన్ని విమర్శిస్తున్న వారిని తిడుతూ వేడి పుట్టించింది.


లైవ్ వీడియోలో శ్రీరెడ్డి చాలా పచ్చిగా బూతులు మాట్లాడేసింది. జగన్ పాలన అద్భుతంగా ఉందని, ఆయన గురించి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించింది. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న నేత జగన్ అని శ్రీరెడ్డి చెప్పింది. ఒక మంచి మనిషి, మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నారని వెల్లడించింది. అంతకు ముందుతో పోలిస్తే జగన్‌లో చాలా పరిక్వత వచ్చిందని పేర్కొంది. ఎంతో గొప్పగా పాలన కొనసాగిస్తోన్న జగన్‌కు చాలా మంది అడ్డంగా వస్తున్నారని.. వాళ్లకు అసలు సిగ్గులేదా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. అది కూడా నా బూతే నా భవిష్యత్ అంటూ విరుచుకుపడుతున్న శ్రేరెడ్డి నీచమైన బూతులు మాట్లాడింది.. మీరు ఆ వీడియోను చూడండి....

 

https://www.facebook.com/iamsrireddy/videos/2499520720303411/

మరింత సమాచారం తెలుసుకోండి: