‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీలు ఒకేసారి విడుదల అవుతున్న పరిస్థితులలో బన్నీ మహేష్ ల మధ్య ఏర్పడ్డ పోటీ మహేష్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య విపరీతమైన చిచ్చు రేపుతోంది. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా విశాఖపట్నంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

‘సంక్రాంతికి అల్లుడు వస్తాడు అనుకుంటే మొగుడు వచ్చాడు’ అంటూ ప్రకాష్ రాజ్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ టీజర్ లో చెప్పిన డైలాగ్ విపరీతంగా మహేష్ అభిమానుల మధ్య పాపులర్ అయింది. దీనితో మహేష్ అభిమానులు ‘సంక్రాంతికి మొగుడు వస్తున్నాడు’ అంటూ అనేక ఊళ్ళల్లో పోస్టర్లు ప్లెక్సీలు పెడుతున్నారు. 

దీనితో ఎలర్ట్ అయిన అల్లు అర్జున్ అభిమానులు ‘సంక్రాంతికి రావలసింది మొగుడు కాదు మగాడు’ అంటూ మహేష్ అభిమానులకు సమాధానం ఇచ్చేలా పోస్టర్లు ప్లెక్సీలు పెడుతున్నారు. ఈ నేపధ్యంలో మహేష్ అభిమానులు విశాఖపట్నంలో ఒక ధియేటర్ ముందు ఏర్పాటు చేసిన ‘సంక్రాంతికి మొగుడు వస్తున్నాడు’ ప్లెక్సీని బన్నీ అభిమానులు తొలిగించి సంక్రాంతికి రావలసింది మొగుడు కాదు మగాడు అంటూ పెట్టిన ప్లెక్సీ పై తీవ్ర రగడ జరుగుతూ మహేష్ బన్నీ అభిమానులు కొట్టుకునే స్థాయికి వెళ్ళి పోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

జరుగుతున్న ఈ పరిణామాలు చూసి మహేష్ అల్లు అర్జున్ మూవీలను అత్యంత భారీ రేట్లకు కొనుకున్న బయ్యర్లు తీవ్ర స్థాయిలో కలవర పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అదేవిధంగా అనేక ఊళ్ళలో మహేష్ బన్నీ అభిమానుల మధ్య రోజురోజుకు పెరిగి పోతున్న ఈ రగడ ఈ రెండు సినిమాలకు తలనొప్పిగా మారి నెగిటివ్ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారంతో ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ టాక్ దెబ్బతినే ఆస్కారం ఉంది అంటూ బయ్యర్లు తీవ్రంగా కలత చెందుతున్నట్లు టాక్. అంతేకాదు ఈ పరిస్థితులను రంగంలోకి దిగి మహేష్ అల్లు అర్జున్ లు సరిద్దుతే బాగుంటుంది అన్న అభిప్రాయాలను కూడ బయ్యర్లు వ్యక్త పరుస్తున్నట్లు తెలుస్తోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: