టాలీవుడ్ స్టార్ హీరోలందరూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అంటే ఎప్పుడూ సిద్ధంగా ఉంటారనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబుకు త్రివిక్రమ్ అంటే చాలా ఇష్టం. అరవింద సమేత సినిమా తరువాత ఎన్టీయార్ కూడా త్రివిక్రమ్ కు క్లోజ్ అయ్యాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తరువాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 2020 జులై 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా తరువాత జూనియర్ ఎన్టీయార్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, తమిళ్ డైరెక్టర్ అట్లీ సిద్ధంగా ఉన్నారు. ఈ ముగ్గురిలో జూనియర్ త్రివిక్రమ్ తోనే సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. 
 
జూనియర్ ఎన్టీయర్ కు దర్శకుడు త్రివిక్రమ్ అపారమైన జ్ఞానం అన్నా త్రివిక్రమ్ మాటలు రాసే విధానమన్నా చాలా ఇష్టం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తరువాత ఇతర దర్శకుల సినిమాల్లో నటించటం కంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం సేఫ్ అని తారక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తారక్ సన్నిహితులు కూడా తారక్ త్రివిక్రమ్ తో సినిమా చేయడమే మంచిదని సూచించినట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్లో అల వైకుంఠపురములో సినిమా తెరకెక్కుతోంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలాంటి హిట్ సినిమాల తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. అల వైకుంఠపురములో సినిమా విడుదలైన తరువాత త్రివిక్రమ్ ఎన్టీయార్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టబోతున్నాడని సమాచారం. 2020 దసరా నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: