వెంకటేష్ నాగచైతన్యలు నటించిన ‘వెంకీ మామ’ మూవీకి మిశ్రమ స్పందన రావడంతో ఈ మూవీ ఓపెనింగ్స్ బాగా వచ్చినా మొన్న సోమవారం నుండి ఈ మూవీ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు అన్న వార్తలు వస్తున్నాయి.  దీనితో  ‘వెంకీమామ’ గట్టు ఎక్క గలుగుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమాను కలెక్షన్స్ విషయంలో నిలబెట్టడానికి ఈ సినిమాను ఇంకా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలా కొనసాగుతూ ఉంటే ‘వెంకీమామ’ కు సపోర్ట్ గా సూపర్ స్టార్ మహేష్ రంగంలోకి దిగి ట్విటర్ వేదికగా కాంప్లిమెంట్  ఇవ్వడమే కాకుండా మామ అల్లుళ్ల పై  తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు.  ‘సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాను. మామ అల్లుళ్ల కెమిస్ట్రీ బాగుంది. కామెడీ ఎమోషన్స్ ఫ్యామిలీ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి’ అని మహేష్ ట్వీట్ చేసాడు. సాధారణంగా మహేష్ తెలుగు సినిమాల గురించి చాలా రేర్ గా స్పందించడమే కాకుండా తనకు బాగా సినిమా నచ్చితేకాని ఓపెన్ కాడు. 

ఇలాంటి పరిస్థితులలో డివైడ్ టాక్ తెచ్చుకుని యావరేజ్ కలక్షన్స్ తో నడుస్తున్న ‘వెంకీ మామ’ ను ఇప్పుడు మహేష్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటూ చాలామంది ఆశ్చర్య పోతున్నారు. అయితే ఇలా మహేష్ చేయడం వెనుక ఒక కారణం ఉంది అని కూడ కామెంట్స్ వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘సరిలేరు నీకెవ్వరు’  మూవీకి   ‘వెంకీమామ’ కు ఒక పోలిక ఉంది అన్న రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ‘వెంకీ మామ’ లో వచ్చే ఆర్మీ యాక్షన్ సీన్స్ లాంటివే ‘సరిలేరు నీకెవ్వరు’ లో కూడ కనిపిస్థాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన యాక్షన్ సీన్స్ కాశ్మీర్ లో తీయడంతో ఇలాంటి రూమర్లు వస్తున్నాయి అని సరిపెట్టుకున్నా ఒకే తరహాలో తీసిన యాక్షన్ సీన్స్ ను జనం మళ్ళీ మళ్ళీ చూస్తారా అన్న సందేహాలు కూడ మరికొందరు వ్యక్త పరుస్తున్నారు..    

మరింత సమాచారం తెలుసుకోండి: