సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీల మధ్య పోటీ మహేష్ బన్నీల ఇగో వార్ గా మారడంతో ఆహీరోల అభిమానులు కూడ రేచ్చిపోతు ఒకరి పై ఒకరు నెగిటివ్ ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈవార్ ను చల్లార్చి మహేష్ బన్నీల అభిమానులకు సఖ్యత చేకూర్చే విధంగా ఒకప్లాన్ డిజైన్ చేయడమే కాకుండా మహేష్ అల్లు అర్జున్ లు ఒకటే అన్నసంకేతాలు ఇస్తున్నాడు బన్నీకి అత్యంత సన్నిహితుడైన బన్నీ వాస్. 

ఈవారం విడుదల కాబోతున్న సాయి తేజ్ ప్రతిరోజు పండగే’ మూవీకి నిర్మాతగా వ్యవహరించిన బన్నీ వాస్ ఆసినిమా విశేషాలను తెలియచేస్తూ త్వరలో తమ గీత ఆర్ట్స్ బ్యానర్ పై మహేష్ తో ఒకసినిమా తీస్తున్న విషయాన్ని వివరించి మహేష్ అల్లు అర్జున్ లు ఒకటే అన్నసంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు ఇప్పటికే ఈసినిమా ప్రాజెక్ట్ కు సంబంధించి అనేకమంది దర్శకులు రచయితలతో చర్చలు జరుపుతున్న విషయాన్ని కూడ లీక్ చేసాడు బన్నీ వాస్. 

ఇదే సందర్భంలో ఈవారం విడుదలకాబోతున్న ‘ప్రతిరోజు పండగే’ మూవీ గురించి బన్నీ వాస్ మాట్లాడుతూ చాలమంది మరణం గురించి బాధపడుతూ ఉంటారని అయితే మరణాన్ని కూడ ఒకపండుగలా జరుపుకోవాలి అన్నసందేశం ఈసినిమాలో ఉండబోతున్న విషయాన్ని వివరించాడు. ఈసినిమా కోసం సాయి తేజ్ పడ్డకష్టాన్ని వివరిస్తూ ఈమూవీ కోసం సాయి తేజ్ సిక్స్ ప్యాక్ కూడ చేసిన విషయాన్ని బయటపెట్టాడు.

ఈసినిమాను ప్రమోట్ చేస్తూ బన్నీ వాస్ మహేష్ తో తీయబోయే సినిమా గురించి ఇచ్చిన వ్యూహాత్మక లీకులు మహేష్ బన్నీల అభిమానుల మధ్య ఏర్పడిన ఒక యుద్ద వాతావరణాన్ని చల్లార్చడానికి మాత్రమే అంటూ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. వాస్తవానికి అల్లు అరవింద్ ఎప్పటి నుంచో మహేష్ తో సినిమా తీయాలని ప్రయత్నిస్తున్న విషయం ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ ఈవిషయాన్ని మళ్ళీ ఒకకొత్త విషయం చెపుతున్నట్లుగా బన్నీ వాస్ ఇస్తున్న లీకులు ‘అల వైకుంఠపురములో’ పై మహేష్ అభిమానులు నెగిటివ్ ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికి చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నాలు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: