టాలీవుడ్ లోకి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  మొదటి సినిమా గంగోత్రి తర్వాత  దేశముదురు, బన్ని, ఆర్య సినిమాలతో మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. తనదైన స్టైల్, డ్యాన్స్, పర్ఫామెన్స్ తో దుమ్మురేపాడు.  బోయపాటి దర్శకత్వంలో ‘సరైనోడు’ మూవీ తర్వాత ‘దువ్వాడ జగన్నాథం’ యావరేజ్ టాక్ వచ్చింది.  ఇక వంశి వక్కంతం దర్శకత్వంలో  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా డిజాస్టర్‌ కావటంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు.  దాదాపు రెండు సంవత్సరాల తర్వాత  తనకు వరుస హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ నే నమ్ముకున్నడు బన్ని.  ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అలా వైకుంఠపురములో’ మువీలో నటిస్తున్నాడు.  

 

ఈ మూవీలో పూజి హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, టబు, జయరామ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత టబూ ముఖ్యపాత్రలో నటిస్తుంది.   అంతే కాదు ఇప్పుడు బన్నీ తన స్పీడ్ పెంచారు. ఇప్పటికే మూడు సినిమాలు లైన్‌లో పెట్టిన స్టైలిష్‌ స్టార్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. గతంలో ఆర్య సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్, తరువాత ఆర్య 2తో ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు.

 

త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ ఉండబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్.  ఇటీవల వెంకీ మామ సినిమాతో మంచి హిట్ అందుకున్న బాబీ (కేయస్‌ రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు బన్నీ ఓకె చెప్పాడన్న టాక్‌ వినిపిస్తోంది.  ఇప్పటికే బాబీ జై లవకుశ, వెంకిమామ లాంటి హిట్ మూవీస్ వరుసగా అందించిన విషయం తెలిసిందే.. బాబీ చెప్పిన కథను బన్నీ ఓకే చేశాడన్న ప్రచారం జరుగుతోంది అంతేకాదు ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: