స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం "అల వైకుంఠపురములో". ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి ౧౨ వ తేదీన ప్రపమ్చ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నయి. అయితే ఈ సినిమా నుండి ఈరోజు ఒక పాట టీజర్ విడుదల చేస్తామని ప్రకటించారు.

 


సినిమా నుండి ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యాయి. ఇందులో రెండు పాటలు వమ్ద మిలియన్ల వ్యూస్ తో సినిమాకి చాలా హైప్ తిసుకొచ్చాయి. మొదటి పాట అయిన సామజవరగమా పాటతోనే ఈ సినిమాకి చాలా హైప్ వచ్చింది. అప్పటి వరకు సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకపోగా, ఒక్కసారిగా ఆ అంచనాలని శిఖరాగ్రానికి తిసుకెళ్ళిన పాట సామజవరగమనా. రెండో పాట అయిన రాములో రాములా అనే పాట కూడా సూపర్ హిట్ అయింది.

 

మూడవ పాట అయిన ఓ మై డాడీ అంతగా అలరించలేక పోయినా ప్రస్తుతం మరో పాట రిలీజ్ కి రంగం సిద్ధం చేశారు. డిసెంబరు ౧౮ వ తేదీ అనగా ఈ రోజు బుట్టబొమ్మ అనే పాట టీజర్ ని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఆ టీజర్ ఈ రోజు విడుదల అవ్వట్లేదట. ఏవో సాంకేతిక కారణాల వల్ల ఈ రోజు టీజర్ ని విడుదల చేయడం ఆలస్యం అవుతుందని హారికా హాసినీ క్రియేషన్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. 

 

అయితే ఈ టీజర్ ని  ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రం చెప్పలేదు. ఇప్పటికే ఈ సినిమా నుండి మరి ఈ పాట కూడా మిగతా పాటల్లాగే అలరిస్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమా థమన్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: