పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. చివరి సినిమా అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆయన సినిమాలకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన మరొసారి సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన పింక్ సినిమా రీమేక్ తో పవన్ కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులని పలకరించనున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

ఈ మేరకు సినిమా లాంఛన కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ లాంచన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాలేదట. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆ కార్యక్రమానికి హాజరు కాలేదట. హిందీ సినిమా పింక్ లో అమితాబ్ బచ్చన్ వేసిన పాత్రను తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఆడవాళ్ల మీద జరిగిన అన్యాయాన్ని ప్రశిమ్చే లాయరుగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు.

 

ఈ చిత్రం ప్రధానంగా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే సీరియస్ కోర్ట్ డ్రామా. కథలో ఈ ముగ్గురు అమ్మాయిలు కీలకంగా ఉంటారు. ఆ ముగ్గురు అమ్మాయిలలో ఒక పాత్ర ‘మల్లేశం’ చిత్రంలో ప్రియదర్మి సరసన హీరోయిన్ గా నటించిన అనన్య దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ చిత్రంలో నటించే అవకాశం అనన్యను వరించింది. పింక్ లో నటించే ముగ్గురు అమ్మాయిల్లో అనన్య ఒకరు కావడం విశేషం. 

 

సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే హీరోయిన్ గా మల్లేశం చిత్రంలో మంచి నటన ప్రదర్శించిన అనన్య, తన నటనతో అందరినీ అలరించింది. విమర్శకుల నుండి అనన్య నటనకి మంచి ప్రశంసలు దక్కాయి. మల్లేషం తర్వాత అనన్య మరో రెండు చిత్రాల్లో నటించింది. వాటిల్లో ప్లే బ్యాక్ అనే చిత్రం మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: