తెలుగు లో వస్తున్న కామెడీ షోల్లో బాగా పాపులారిటీ సంపాదించింది ‘జబర్ధస్త్’.  ఏడేళ్ల క్రితం ప్రారంభం అయిన జబర్థస్త్ కామెడీ షో తో ఎంతో మంది కళాకారు తమ సత్తా నిరూపించుకుంటున్నారు. జబర్ధస్త్ తో కమెడియన్లుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వేణు, ధన్ రాజ్, తాగుబోతు రమేష్, శకలక శంకర్, చమ్మక్ చంద్ర ఇలా మరికొంత మంది వెండితెరపై తమదైన కామెడీ మార్క్ చాటుకుంటున్నారు. ఈ మద్య జబర్ధస్త్ లో కొన్ని మార్పులు చేర్పులు జరిగిన విషయం తెలిసిందే.  ఎప్పటి నుంచో జడ్జీగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు ఈ షో నుంచి వెళ్లిపోయారు. 

 

ఆయన స్థానంలో కొంత మంది సీనియర్ నటులు వస్తారని అనుకున్నా ఇప్పటి వరకు దానిపై క్లారిటీ రాలేదు.  ప్రస్తుతం ఎమ్మెల్యే, నటి రోజా జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  సాధారణంగా జబర్ధస్త్ లో కొన్ని స్కిట్స్ చాలా వల్గర్ గా ఉంటున్నాయని ఇటీవల ఎన్నో ఆరోపణలు వచ్చాయి.  స్కిట్ చేస్తున్న కమెడియన్లు కొన్ని సార్లు  జడ్జిలపై, తోటి ఆర్టిస్టులపై, యాజమాన్యంపై.. సెటైర్లు వేస్తూ నవ్విస్తుంటారు.  అప్పటి వరకు అవి బాగున్నా తర్వాత కొన్నిసార్లు సీరియస్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా గత వారం ప్రసారమైన ఎపిసోడ్‌లో జడ్జి రోజా ను ఓ కమెడియన్ చాలా ఇబ్బందికి గురి చేసినట్లు సమాచారం.. దాంతో అతనిపై రోజా సీరియస్ కూడా అయ్యారట.

 

అసలు విషయానికి వస్తే.. స్కిట్‌లో భాగంగా మాస్ అవినాష్‌ రోజా నా తల్లి అంటూ వ్యాఖ్యలు చేశాడు. స్కిట్‌లో భాగంగా ప్లకార్డులు కూడా పెట్టించాడు.  రోజా గారు నన్ను కొడుకుగా గుర్తించే వరకు ఆమరణ నిరాహార దీక్ష, రోజా నా కన్న తల్లి’ అంటూ ప్లకార్డు పెట్టాడు. మమ్మీ! అంటూ అవినాష్ అనగా చంపుతా! నోరు మూయ్.. అంటూ సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చింది.  కానీ అవినాష్ తన ఓవర్ యాక్టింగ్ తో తల పట్టుకొని వీడేంట్రా అన్నట్లు చూసింది. గతంలో సుడిగాలి సుధీర్.. నాగబాబును డాడీ అని అనడం అప్పట్లో వైరల్ అయ్యింది. ఇప్పుడు రోజాను అవినాష్ మమ్మీ అని సంబోధించడంతో నెటిజన్లు సైతం పెదవి విరుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: