ఎవడుకొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్దో వాడే పండుగాడు… అని టాలీవుడ్ సినిమాల ట్రెండ్ ను తన సైన్ తో సెట్ చేసిన హీరో మహేష్ బాబు. మహేష్ బాబు బాలనటుడుగా పరిచయమైనప్పటికీ.. .హీరోగా మాత్రం మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన `మురారి` చిత్రం మహేష్కు భారీ విజయాన్ని తెచ్చిపెట్టాయి. అప్పటి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రస్తుతం టాలీవుడ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే మహేష్ కెరీర్ ప్రారంభం నుంచీ క్లాస్ సినిమాలే చేశారు.
మాస్ సినిమాల వైపు మాత్రం తొగి చూడలేదు. ఇక మహేష్కు క్లాస్ అభిమానులు ఎక్కువే ఉన్నారు. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఏ హీరోకు సొంతం కాని లేడీ ఫ్యాన్ బేస్ కేవలం మహేష్ కు మాత్రమే సొంతం. తొలి సినిమా రాజకుమారుడుతోనే మహేష్ కు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మొదలైంది. సినిమా సినిమాకు ఆ ఫాలోయింగ్ పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. మహేష్ బాబుకు పెళ్లై చాలా సంవత్సరాలే అయినా అతనంటే అభిమానం చూపించే అమ్మాయిల సంఖ్య మాత్రం పెరుగుతూనే వస్తున్నారు. నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా యంగ్ గా కనపడడమే ఈయన ఫాలోంగ్కు ఒక కారణంగా చెప్పవచ్చు.
అయితే క్లాస్ సినిమాలనే ఎంచుకుంటున్న మహేష్ బాబుకు మాస్ అభిమానులు ఎక్కువగానే ఆరాధిస్తుంటారు. వాస్తవానికి టాలీవుడ్లో చాలా మంది హీరోలకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. కానీ.. మహేష్ బాబు విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. ఎందుకంటే.. క్లాసు లో తిరుగులేని ఇమేజ్ ఉన్న మహేష్ కు ఈ మాసంలో కూడా అంతే స్థాయిలో మాస్ అండ్ క్లాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం. ఇక మహేష్కు కులాలు, వర్గాలతో సంబంధం ఉండదు.
దీంతో అందరు హీరోల అభిమానులు ఈయన్ను ఆరాధిస్తుంటారు. సో.. మాస్ మెచ్చిన క్లాస్ హీరో ఈ సూపర్స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.