తెలుగులో వన్ ఆఫ్ ది నెంబర్ వన్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి మూడో తరం నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవడిగా తన సత్తా చాటుకున్నాడు. సినిమాల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు జూనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే వరుస హిట్లతో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఎన్టీఆర్ బాలనటుడుగా చేసినప్పటికీ.. హీరోగా మాత్రం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఎన్టీఆర్ మంచి సక్సెస్ తెచ్చిపెట్టిది.
అయితే ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బాలయ్య వరుస ప్లాపులతో ఉండేవాడు. ఆ టైమ్లో బాలయ్యకు పదేళ్లలో కేవలం సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రెండు హిట్లు మాత్రమే వచ్చాయి. ఆ టైమ్లోనే ఎన్టీఆర్ వరుసగా స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతూ బాలయ్యను మైమరపించారు. అంత తక్కువ వయసులోనే ఎన్టీఆర్కు వచ్చిన స్టార్డమ్ చాలామంది అగ్ర హీరోలకు సైతం చెమటలు పట్టించింది. దీంతో వాళ్ళంతా ఎన్టీఆర్ ను చూసి అసూయ పడేలా చేసింది. అయితే ఎన్టీఆర్ కు అంత తక్కువ వయసులోనే వచ్చిన క్రేజ్తో.. తెలుగు సినిమా అభిమానులు ఎన్టీఆర్ భవిష్యత్తులో ఖచ్చితంగా బాలయ్యను దాటేస్తాడని అనుకున్నారు.
ఇప్పుడు ఖచ్చితంగా అదే జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస హిట్లతో దూసుకుపోతుంటే.. బాలయ్య క్రేజ్ అమాంతం పడిపోతూ వస్తోంది. వాస్తవానికి పెళ్లి తర్వాత ఎన్నో ఫ్లాపులు ఎదుర్కొన్న ఎన్టీఆర్కు.. పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచీ ఫ్లాపులు లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మరోవైపు బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ను తీసి కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఏదేమైన ఎన్టీఆర్ క్రేజ్కు.. బాలయ్య క్రేజ్కు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పాలి.