పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే కెమెరా ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతుండటంతో అందరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు. బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించారు. ఇదే సినిమాని కోలీవుడ్ లో రీమేక్ చేశారు. అజిత్ నటించిన ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అందుకనే ఇప్పుడు పింక్ సినిమాని పవన్ కళ్యాణ్ తో తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాకు ఈమధ్యే ప్రారంభోత్సవం జరిగింది. 

 

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక అడ్వొకేట్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో మూడు కీలకపాత్రలు ఉన్న విషయం తెలిసిందే.  ఈ పాత్రలకోసం ముగ్గురు హీరోయిన్లను సెలెక్ట్ చేశారు. వాళ్ళలో నివేదా థామస్, అంజలి ని ఇంతకముందే సెలెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరి గురించి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ రాలేదు గాని మూడవ హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటి ఇచ్చారు చిత్ర బృందం. అనన్యను ఒక హీరోయిన్ గా ఎంపిక చేశారన్నది తాజా సమాచారం.

 

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన అనన్య 'మల్లేశం' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాలో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా అటు ప్రియదర్శికి ఇటు అనన్యకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో పాటు 'ప్లే బ్యాక్' సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది అనన్య. రీసెంట్‌గా  రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ లో 1993 నాటికాలం అమ్మాయిగా కనిపించింది. ఇప్పుడేమో ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి ఆఫర్ దక్కడంతో అనన్య ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: