అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ..;గీతగోవిందం సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు ఈ సినిమా తర్వాత ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం క్రాంతి మాధవన్ సినిమాలో దర్శకత్వంలో వరల్డ్ ఫెమస్ లవర్ .. తెరకెక్కుతుంది. దీంతో ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. 

 

హీరో విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. ఈ సినిమా తరువాత అయన పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేయనున్నాడు. ఇప్పటికే విజయ్పూరి ల ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొనడమే కాకుండా దీన్ని పాన్ ఇండియా సినిమాగా తీర్చిదిద్దే సన్నాహాలు చేస్తుండడంతో ఈ అంచనాలు భారీగా పెరిగాయి.

 

ఇకపోతే ఈ సినిమాకు స్వర్గీయ నటి శ్రీదేవి కూమార్తె జాన్వీ ఈ సినిమాలో నటిస్తుందని సమాచారం. అటు జాహ్నవి ని కూడా మంచి సినిమాతో సౌత్ కు పరిచయం చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు .. ఈ నేపథ్యంలో విజయ్ సరసన ఛాన్స్ దక్కడంతో రెడీ చెప్పింది. అయితే ఈ సినిమా కోసం జాహ్నవి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. అంత ఇస్తే తప్ప .. చేయనని చెప్పిందట. 

 


అయితే,అందుకోసం ఈ అమ్మడికి ఏకంగా మూడున్నర కోట్లకు ఒప్పించారట. హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెట్టిన జాహ్నవి ఈ సినిమా కోసం ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం అందరికి షాక్ ఇస్తుంది.పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పూరి టూరింగ్ టాకీస్ మరియు కరణ్ జోహార్ బ్యానర్స్ పై తేరారకేక్కే ఈ సినిమా జనవరిలో ప్రారంబిస్తారట. కాగా, ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్, హిందీ,  కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: