టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా అతి త్వరలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక నేటితో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తున్నట్లు హీరో మహేష్, నిర్మాత దిల్ రాజు, అనిల్ సుంకర, దర్శకుడు అనిల్ రావిపూడి సహా యూనిట్ మొత్తం ఒక ఫోటో దిగి పోస్ట్ చేసింది. మహేష్ బాబు ఈ సినిమాలో మేజర్ అజయ్ కృష్ణ అనే మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. 

 

ఇకపోతే ప్రముఖ సీనియర్ నటి విజయశాంతి కొన్నేళ్ల విరామం తరువాత ఈ సినిమా ద్వారా మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే రెండు వరుస విజయాలు అందుకున్న సూపర్ స్టార్, తప్పకుండా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టి తీరుతారని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ మరియు టీజర్, యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ సంపాదించడంతో పాటు సినిమాపై మరింతగా అంచనాలు పెంచేయడం జరిగింది. ఇకపోతే కొందరు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన అద్భుతన నటనతో పేకాడేశారని, 

 

రేపు సినిమా రిలీజ్ తరువాత థియేటర్స్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం అని అంటున్నారు. కొన్నాళ్లుగా మహేష్ బాబు ఎక్కవగా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఉన్న రోల్స్ లోనే నటిస్తూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఫ్యాన్స్ ఆశిస్తున్న మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన పాత్ర మహేష్ కి దొరకడంతో, ఆయన కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ సినిమాలో నటించారట. రేపటి నుండి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: