మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ కుటుంబాల గురించి తప్పుగా మాట్లాడినందుకు బాలీవుడ్ నటి పాయల్ రోహాత్గిని అరెస్ట్ చేశారు రాజస్థాన్ పోలీసులు. అహ్మదాబాద్‌లో ఉన్న పాయల్ ను అరెస్ట్ చేసి రాజస్థాన్‌లోని బుండి జైలులో పెట్టారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో పోలీసులు పాయల్ ను విడుదల చేశారు. తనను క్రిమినల్స్ ఉన్న జైల్లో పెట్టారంటూ పాయల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాత్రంతా జైల్లో నరకం అనుభవించానని వాపోయింది.

 

అయితే పాయల్ అరెస్ట్ ను తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించింది. గుజరాత్ లోని బుండీ కోర్టులో పాయల్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగింది. కోర్టు పాయల్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో పాయల్ అరెస్ట్ అవ్వక తప్పలేదు. పాయల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు 8 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. అక్టోబర్ 10న ఈ కేసు నమోదు అవ్వగా ఇటీవల పాయల్ అరెస్ట్ అయ్యింది.

 

‘ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. అసలు నేనేం చేశానని నాకు ఇలా జరిగింది. అహ్మదాబాద్‌లో ఉన్న నన్ను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందు నన్ను ఓ దరిద్రమైన సెల్‌లో పెట్టారు. ఆ తర్వాత ఐదుగురు క్రిమినల్స్ ఉన్న జైల్లో పెట్టారు. ఆ చలిలో నేల మీదే పడుకోబెట్టారు. రాత్రంతా నరకం అనుభవించా. మరో రాత్రి గడిపి ఉంటే నేను బతికుండేదాన్నో లేదో తెలీదు...అంటూ ఆవేదన చెందారు.

 

నా భర్త చాలా అమాయకుడు. చట్టం రూల్స్ ఏంటో మాకు తెలీదు. అందుకే రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయగలిగారు. ముందే నోటీసులు పంపామని, నేను రిప్లై ఇవ్వలేదని అరెస్ట్ చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికి నేను జైలు నుంచి బయటకు వచ్చాను. ఈ ఘటనను నేను అస్సలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ ఇలాంటి అనుభవం నాకు ఎదురుకాకూడదని అనుకుంటున్నాను. మీడియా నాకు సపోర్ట్ చేసిందనే అనుకుంటున్నాను’’ అంటూ తన జైలు అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: