‘సరి లేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మధ్య పోటీ మహేష్ బాబు అల్లు అర్జున్ ల వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన వార్ గా మారడంతో ఈరెండు సినిమాలకు సమన్యాయం చేయడానికి వ్యూహాత్మకంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ లు రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సంక్రాంతి రేస్ మహేష్ బన్నీల అభిమానుల మధ్య వార్ గా మారడంతో మహేష్ తనకు బన్నీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని తెలియ చేయడానికి తన మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా చిరంజీవిని రమ్మని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

ఒకవేళ చిరంజీవికి కుదరకపోతే రామ్ చరణ్ ను అతిధిగా పిలవాలని మహేష్ ఇప్పటికే ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ చరణ్ లకు ఉన్న వ్యక్తిగత స్నేహం రీత్యా చరణ్ మహేష్ కోరికను తిరస్కరించలేడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

ఈ వ్యూహాలు ‘అల వైకుంఠపురములో’ నిర్మాతల దృష్టి వరకు వెళ్ళడంతో తమ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ ను అతిధిగా తీసుకు వచ్చి బన్నీ పవన్ ల మధ్య ఎటువంటి గ్యాప్ లేదనీ మరొకసారి పవన్ అభిమానులకు తెలియచేయడానికి వ్యూహాలను అనుసరిస్తూ త్రివిక్రమ్ ద్వారా పవన్ తో రాయబారాలు చేస్తున్నట్లు టాక్. 

దీనితో మహేష్ సినిమాను చిరంజీవి బన్నీ సినిమాను పవన్ ప్రమోట్ చేస్తూ ఈ రెండింటికి సమన్యాయం చేస్తూ ఈ రెండు భారీ సినిమాల ఘన విజయానికి తమ వంతు సహకారం చేస్తూ తమ పెద్దరికాన్ని చిరంజీవి పవన్ లు నిలబెట్టుకుంటూ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు అంతా ఒకే కుటుంబం అన్న సంకేతాలు ఇస్తారని తెలుస్తోంది. ఈ విధంగా మహేష్ సినిమాను చిరంజీవి అల్లు అర్జున్ సినిమాను పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయడం ద్వారా వీరిద్దరి సినిమాల పై రోజురోజుకు పెరిగి పోతున్న నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకట్ట వేయవచ్చని ఈ నిర్మాతల వ్యూహాలు ఎంతవరకు విజయవంతం అవుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: