రామ్ చరణ్ ,ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ ప్రస్తుతం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టిఆర్ కొమరం భీం గా కనిపించనుండగా, రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పై సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. నిజాంకి ఎదురు తిరిగే సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం. 

 

అయితే చాలా సీరియస్ గా జరుగుతున్న ఈ ప్రాసెస్ కి రాజమౌళి ఒకరోజు విరామం ఇవ్వనున్నాడట. డిసెంబరు 25 వ తేదీన షూటింగ్ విరామం ఇచ్చి సినిమా చూడడానికి వెళ్తున్నాడట. వివరాల్లోకి వెళితే, కీరవాణి తనయుడు శ్రీ కోడూరి సింహా హిరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రితేష్ రానా దర్శకత్వం వహించిన "మత్తు వదలరా" చిత్రం డిసెంబరు 25 వ తేదీన విడుదల అవుతుంది.

 

ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. నిన్న ఈ మూవీ ట్రైలర్ ని రానా దగ్గుబాటి విడుదల చేయడం జరిగింది. నేపథ్యంలో రాజమౌళి ఆ సినిమాను ఉద్దేశిస్తూ మా ఇద్దరు కుర్రాళ్ళు శ్రీ సింహ, కాలభైరవ ఈ మూవీ తో సినీ అరంగేట్రం చేస్తున్నారు. నేను భావోద్వేగానికి గురవుతున్నాను. దర్శకుడు రితేష్ రానా బాగా తీశారు. మూవీ విడుదల రోజు నేను షూటింగ్ మానేస్తా అంటూ ట్వీట్ చేశారు. 

 

కాబట్టి డిసెంబర్ 25న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మత్తు వదలరా సినిమాకు వెళతారట. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో వచ్చే ఏడాది జులై 30 వ తేదీన విడుదల అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: