నందమూరి బాలకృష్ణ హీరోగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించిన రూలర్ సినిమా రేపు విడుదల కాబోతుంది. టాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రేక్షకులు రొటీన్ మాస్ మసాలా కథలను తిప్పికొడుతున్నారు. కథలో కొత్తదనం ఉంటే మాత్రమే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ సత్యం గ్రహించే సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కూడా రొటీన్ మాస్ మసాలా మూస చిత్రాలకు దూరంగా ఉంటున్నారు. 
 
కానీ బాలకృష్ణ మాత్రం రొటీన్ మాస్ కథలను ఎంచుకుంటూ ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. రెండు, మూడు దశాబ్దాల క్రితం తెరకెక్కి హిట్టైన మూస కథల ఫార్ములాతోనే బాలకృష్ణ రూలర్ సినిమా తెరకెక్కుతోంది. తరాలు మారుతున్నా, సంవత్సరాలు, మారుతున్నా కథల ఎంపిక విషయంలో బాలకృష్ణ మాత్రం ఏం మారట్లేదు. అవే రొటీన్ మాస్ మసాలా మూస కథలతో ప్రేక్షకులను విసిగిస్తున్నాడు. 
 
బాలకృష్ణ ఈ మద్య కాలంలో నటించిన లయన్, డిక్టేటర్, పైసా వసూల్, జై సింహా సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఇలాంటి కథల పట్ల బాలకృష్ణ తప్ప ఇతర హీరోలు ఆసక్తి కూడా చూపట్లేదు. బాలకృష్ణ ఇప్పటికైనా కథల విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం మరిన్ని ఫ్లాపులు జతయ్యే అవకాశం ఉంది. బాలకృష్ణ రొటీన్ మాస్ మసాలా మూస కథలను ఎంచుకోకుండా నవ్యత ఉన్న సినిమాల్లో నటించాలని బాలయ్య అభిమానులు కూడా కోరుకుంటున్నారు. 
 
ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు, నాలుగు ఫైట్లు, కొడితే విలన్లు గాల్లోకి ఎగిరిపోవడాలు, భారీ డైలాగుల సినిమాలను ప్రేక్షకులు చూడటం మానేసి చాలా కాలమైంది. బీ సీ సెంటర్ల ప్రేక్షకులు కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలను ఆదరించటం లేదు. బాలకృష్ణ ట్రెండ్ కు తగ్గట్టుగా మారాలని తోటి సీనియర్ స్టార్ హీరోలలా కథల విషయంలో జాగ్రత్త పడాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రొటీన్ మాస్ మసాలా మూస కథతో తెరకెక్కిన రేపు విడుదల కాబోయే రూలర్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: