మెగా కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని తెలుగు ప్రేక్షకులందరికీ సుప్రీం హీరో గా మారిపోయాడు సాయి ధరమ్ తేజ్. చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకొని దూకుడు మీదున్న సాయి ధరంతేజ్ ప్రస్తుతం ప్రతి రోజు పండగే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా ఈ సినిమా డిసెంబర్ 20న అంటే రేపు విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో విలక్షణ నటుడు సత్యరాజ్ నటిస్తుండగా ఈ సినిమాని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నారు . ఇక క ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.
అయితే ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న సినిమాల అన్నింటికీ తెలుగు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ప్రతి రోజు పండగే సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వినోదభరితంగా సాగే కథాంశంతో తెరకెక్కినదే కావటం విశేషం . ఈ మధ్య ఇలాంటి సినిమాలన్నీ మంచి విజయం సాధిస్తున్నాయి. ఇక అంతే కాకుండా దర్శకుడు మారుతి సినిమాలంటే మంచి కథ కథాంశం ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇకపోతే మారుతి తన సినిమాల్లో కామెడీతో కడుపుబ్బా నవ్వించగలడు . దీంతో మారుతి సినిమాలంటే ప్రేక్షకుల్లో మినిమం ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ అన్న భావన ఉంటుంది.
ఇక సాయి ధరమ్ తేజ్ కామెడీ టైమింగ్ గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించ గలడు సాయి ధరమ్ తేజ్. దీంతో ప్రతి రోజు పండగే సినిమా ఇక మెగా అభిమానులకు పండుగ గా మారబోతుంది అని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రాశి కన్నా టిక్టాక్ ఎడిట్ అయిన యువతి గా నటిస్తూ ఉంటుంది. దీంతో కామెడీ బలంగా ఉండబోతుంది అన్నది కూడా సగటు ప్రేక్షకుడి భావన. కాగా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ప్రతి రోజు పండగే సినిమా తెలుగు ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్వించి పండగగా మారబోతుందా లేదా అన్నది చూడాలి మరి.