బాలకృష్ణ లేటెస్ట్ మూవీ రూల‌ర్ మ‌రికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదివరకే తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ తో చేసిన జై సింహా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ ఓవర్ ఆల్ గా మాత్రం పర్వాలేదనిపించింది. కాగా మళ్లీ అదే దర్శకుడితో బాలయ్య సినిమా చేస్తుండడంతో ఈ సినిమా ఎంతవరకు  సక్సెస్ అవుతుందో అని బాలయ్య ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే కె ఎస్ రవికుమార్ తో బాలయ్య మరోక సినిమా అనౌన్స్ చేసినపుడే నందమూరి ఫాన్స్ లో కొందరు, 

 

బాలయ్యని ఈ సినిమా చేయొద్దంటూ నెత్తి, నోరు కొట్టుకున్నారు. దానికి కారణం ఇటీవల బాలయ్య  క్రిష్ దర్శకత్వంలో నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఫ్లాప్ కావడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అయినా కూడా ఎవరి మాటలు పట్టించుకోకుండా రవికుమార్ ని నమ్మి బాలయ్యసినిమా చేశాడు. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తుంటే, సినిమాలో పెద్దగా కొత్తదనం ఉండే పరిస్థితి కూడా కనపడడం లేదు. పైగా బాలయ్య ఇదివరకు చేసిన సినిమాల్లోని సీన్స్, సాంగ్స్ లాగే ఉన్నాయని కొందరు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. రూలర్ కు సంబందించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు, 

 

ట్రైలర్ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం ఇప్పుడు నందమూరి ఫాన్స్ ని మరింత టెన్షన్ లో పడేసింది. మన తెలుగు డైరెక్టర్లే మన హీరోలతో సరైన సక్సెస్ లు ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉన్న ఇటువంటి స్థితిలో, గతంలో తనకు యావరేజ్ విజయాన్ని అందించిన కేఎస్ రవికుమార్ తో కలిసి బాలయ్య  చేసిన ఈ రూలర్ ఎంత మేర సక్సెస్ ని ఆదుకుంటుందో అని  అనుమానము వ్యక్తం చేస్తున్నారు. మరి రవికుమార్ ని మరొక్కసారి నమ్మి ఈ సినిమా చేసి ధైర్యంగా ముందడుగేసిన బాలయ్య, సక్సెస్ ని అందుకుంటారో లేదో రేపు ఈ సమయానికి పూర్తిగా తెలిసిపోనుంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: