సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ మద్య సాయి తేజ్, సత్యరాజ్ పాత్రలతో కూడిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరవాత వచ్చిన పోస్టర్లు కూడా ప్రమోషన్స్‌కి బాగా పనికొచ్చాయి. 

 

ఇప్పటి వరకు సాయి ధరమ్ మాస్ ఇమేజ్ తో ప్రేక్షకుల  ముందుకు వచ్చాడు.  మొదటి సారిగా ఫ్యామిలీ తరహా సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాది సాయిధరమ్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.  వరుస ఫ్లాపులతో సతమతమయిన ఈ మెగా హీరో మాస్ తో పాటు క్లాస్, ఫ్యామిలీ తరహా ఆడియన్స్ కి దగ్గరకావాలని చూస్తున్నాడట.  లంగ్ క్యాన్సర్‌ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉండి, కేవలం అయిదు వారాలు మాత్రమే లైఫ్ స్పాన్ ఉన్న సత్యరాజ్ చివరి కోరికగా విదేశాల్లో ఉండే తన వారిని చూడాలనుకోవడం, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. మనవడు వచ్చి తాతని సంతోష పరచడం నిజంగా గుండెలకు హత్తుకునే విధంగా ఉంటుందని అంటున్నారు చిత్ర యూనిట్.  

 

గతంలో శర్వానంద్ నటించిన శతమానం భవతి మూవీ కూడా ఇదే తరహాలో ప్రకాశ్ రాజ్ కి తన కుటుంబాన్ని దగ్గర చేసే పాత్రలో నటించాడు..ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  ఇప్పుడు ఇదే తరహా ఫ్యామిలీ తరహా సినిమాలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నాడు. మారే కాలంతో పాటు మనమూ మారాలి.. వయసుతో పాటు ఆశలు కూడా చచ్చిపోవాలి వంటి డైలాగులు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. బంధాలు, సంబంధాలు.. కుటుంబ విలువలు చాటిచెప్తూ తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ రేపు విడుదల కాబోతుంది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: