కోలీవుడ్ లో వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్, మంజు వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘అసురన్’ బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పటికే రూ.150 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ రిమేక్ కి ప్రయత్నాలు మొదలయ్యాయి. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేశ్, బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ నటించేందుకు సిద్దమయ్యారు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వీ క్రియేషన్స్ బేనర్పై సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు. మొదట ఈ మూవీ రాజుగారి గది డైరెక్టర్, యాంకర్ ఓంకార్ కి ఛాన్స్ ఇవ్వాలని చూశారు.. కానీ వరుస అపజయాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ ధైర్యం చేయలేకపోయారు. ఆ తర్వాత మరికొంత మంది దర్శకులు అనుకున్నప్పటికీ చివరికి ఈ మూవీ శ్రీకాంత్ అడ్డాల చేతికి వెళ్లినట్లు టాలీవుడ్ సమాచారం.
ఈ మూవీ డైరెక్టర్ విషయంలో కొన్ని రోజులుగా రక రకాల కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. మరి కొద్ది రోజులలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ ఎవరు తెరకెక్కిస్తారా అనే ఆసక్తి అభిమానులలో ఉండగా, శ్రీకాంత్ అడ్డాల పేరు ఫ్రేంలోకి వచ్చింది. గతంలో వెంకటేష్, మహేష్ బాబు తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి ఫ్యామిలీ ఎమోషన్ ఎంట్రటైన్ మెంట్ తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాలనే సరైనా న్యాయం చేస్తారని విక్టరీ వెంకటేశ్ నమ్మనిట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ‘అసురన్’ రిమేక్ మూవీపై వెంకటేశ్ స్పందిస్తూ.. గతంలో శ్రీకాంత్తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసాను. అతని పని శైలి నాకు తెలుసు. మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఇండస్ట్రీలో మరిన్నిసినిమా ఆఫర్స్ పొందాలనే కసితో శ్రీకాంత్ అడ్డాల ఉన్నారు అని వెంకీ అన్నారు.
తమిళంలో ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. కేవలం నటనకు మాత్రమే ఈ మూవీ ఎంతో ప్రాధాన్యం ఉన్నందున ‘అసురన్’ రిమేక్ పై దృష్టిపెట్టినట్లు ఆయన అన్నారు. ఈ ఏడాది ఎఫ్ 2, వెంకిమామ తో మంచి విజయాలు అందుకున్న వెంకటేష్ ‘అసరన్’ రిమేక్ తో మరో విజయం అందుకుంటారని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.