నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య నటించిన"రూలర్"సినిమా  మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. గతం లో సింహ, లెజెండ్ లాంటి  సూపర్ హిట్లు ఇచ్చిన బోయపాటి తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. 

 

సినిమా తర్వాత బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సినిమా సీక్వెల్ ను తెరకెక్కనుందని సమాచారం. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పట్టాలెక్కాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదాపడుతూ వస్తుంది. బాలయ్య 100 సినిమాగా ఆదిత్య 369 సినిమా సీక్వెల్ ఆదిత్య 999 పేరుతో సినిమా చేయాల్సి ఉంది. కానీ గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య బిజీ అవ్వడంతో ఈ సీక్వెల్ అటకెక్కింది. 
 

 

తాజాగా ఈ సినిమా పై బాలయ్య మరోసారి దృష్టి పెట్టాడు. ఎలాగై నా ఈ సారి సినిమా ను పట్టాలెక్కించాలని పట్టుబట్టాడు. బోయపాటి సినిమా పూర్తయిన వెంటనే ఆదిత్య 999ను మొదలుపెట్టాలని చూస్తున్నడు. ఆసక్తికరమైన విషయమేంటంటే . ఈ సినిమాకు స్వయం గా బాలకృష్ణనేదర్శకత్వం వహించనున్నారు. మొదటి పార్ట్ లో భూత , భవిషత్, వర్తమాన కలలోకి ప్రయాణించే టైం మిషన్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. కానీ సీక్వెల్ లో కేవలం వర్తమానం పైనే కథ ఉండేలా తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసి సినిమాను తెరకెక్కించాలని బాలయ్య భావిస్తున్నాడు. 

 

సినిమా కు అన్నీ తానై నడిపించడం బాలకృష్ణకు కొత్తేమి కాదు. మరి అప్పట్లో బాలయ్య ఇమేజ్ కు మైలేజ్ పెంచిన సినిమా  ఆదిత్య 369.   సీక్వెల్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: