టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఎలాంటి స్నేహం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరు కలిసి తొలిసారి ‘జల్సా’ సినిమా కోసం పనిచేసారు. అక్కడ నుంచే వీరి స్నేహం మొదలైంది. వారిద్దరి ఆలోచనలు, అభిరుచులు అన్ని కూడా ఒకేలా ఉంటాయని అంటూ ఉంటారు అభిమానులు. ఎక్కడికి వెళ్ళిన పవన్ కి వెంట త్రివిక్రమ్ ఉండాల్సిందే.. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అయితే ‘అజ్ఞాతవాసి’ మాత్రం డిజాస్టర్గా మిగిలిపోయింది. అప్పటి వరకు ఓ స్థాయిలో ఉన్న త్రివిక్రమ్ క్రేజ్ ఈ ఒక్క సినిమాతో ఇబ్బందుల్లో పడింది. కానీ వీరి మధ్య స్నేహం మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు.
అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. తన ఫోకస్ మొత్తం కూడా రాజకీయాల పైనే పెట్టారు. ఇక పవన్ పోలిటిక్స్లోకి వెళ్ళాక కూడా త్రివిక్రమ్ చాలావరకు పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేసాడు. కానీ తర్వాత పవన్ సినిమాలు వదిలెయ్యడం, త్రివిక్రమ్ వేరే హీరోలతో బిజీ అవ్వడంతో.. వీరి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్లేస్ను ఎన్టీఆర్ రీప్లేస్ చేశాడు. గతంలో ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన `అరవింద` సమేత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తీసిన దగ్గరనుండి వీరిమధ్యన స్నేహం బలపడిందని, త్రివిక్రమ్ కి పవన్ తర్వాత ఎన్టీఆర్ బాగా దగ్గరయ్యాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.
ఇక తాజాగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ తెలివితేటలకు, మేథా శక్తికి మరియు ఆయన రాసె డైలాగ్స్ కి ఎన్టీఆర్ ఫిదా అయిపోయారంటూ టాలీవుడ్లో వార్త చక్కెర్లు కొడుతోంది. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. మరో వైపున బన్నీ సినిమా పనులతో త్రివిక్రమ్ తీరికలేకుండా ఉన్నాడు. జనవరిలో త్రివిక్రమ్ ఫ్రీ అయితే, ఫిబ్రవరికి ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రంగం సిద్ధమవుతోంది. మరియు ఈ సారి ఎన్టీఆర్తో చేయనున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.