ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో రెండు వరుస సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్, ప్రస్తుతం అదే ఊపులో నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై అత్యంత భారీగా మరియు ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ మరియు సాంగ్స్, సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసాయి. 

 

మహేష్ బాబు మిలిటరీ మేజర్ గా తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ లో మరింతగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో మిలిటరీ మేజర్ గా కనపడే మహేష్ బాబు, సెకండ్ హాఫ్ లో ఒక సమస్య నిమిత్తం కర్నూల్ చేరుకొని, అక్కడ విలన్ల భరతం పడతాడని సమాచారం. అలానే సినిమాలో మహేష్ బాబు కర్నూలు యాసలో కొన్ని డైలాగులు కూడా చెప్పనున్నారట. ఇటీవల ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత సినిమా కూడా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కగా, 

 

ఆ సినిమాలో కూడా ఎన్టీఆర్ కర్నూలు యాసలో డైలాగ్స్ చెప్పి ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు కూడా ఎన్టీఆర్ బాటలో కర్నాలు మాండలికంలో మాట్లాడి ఫ్యాన్స్ ని ఖుషి చేయనున్నారట. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి చాలా రోజుల తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. మరి ఎన్నో అంచనాలతో సంక్రాంతి పండుగ కానుకగా రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: