మెగా హీరోలు జోరు పెంచుతు సక్సస్ లను అందుకోవాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఇమేజ్ ఎంట్రీకి కలిసొచ్చినా కొన్ని తప్పటడుగులతో రేసులో వెనకబడిన సాయి తేజ్ ప్రస్తుతం ట్రాక్ లోకి వారడానికి సెలెక్టెడ్ గా కథలను ఎంచుకుంటు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అంతేకాదు బన్నీ, రాం చరణ్ ల మాదిరిగా స్టార్ ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా వరుణ్ తేజ్ కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాని సాయి తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మంచి కథ దొరికితే ఇద్దరం కలిసి సినిమా చేస్తామని అన్నాడు. ఇక సాయితేజ్ అరడజను పరాజయాల తర్వాత చిత్రలహరి సినిమా విజయంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతి రోజూ పండగే సినిమాలో నటిస్తున్నాడు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

 

కంబ్యాక్ లో బ్లాక్ బస్టర్ కొట్టాలన్న ప్రయత్నంలో ఈ సినిమాపై  చాలా ఆశలు పెట్టుకున్నాడు. తప్పనిసరి బ్లాక్ బస్టర్ సన్నివేశం ఉందనే చెప్పాలి. అందుకే నేరుగా అభిమానుల దగ్గరకే వెళ్లి సినిమా చూడండి అంటూ వరుస టూర్లతో ఓ ప్రయత్నం చేశాడు. వెళ్లిన ప్రతి చోటా ఘనంగా ఆహ్వానం దొరికింది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందన్నది ఇంకా కొన్ని గంటల్లో తేలిపోనుంది. 2020లో సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాకి సుబ్బు అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఆ తర్వాత సాయితేజ్ చేతిలో ఎలాంటి కమిట్ మెంట్లు లేవు. తాజాగా వరుణ్ తో కలిసి సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నాను.. కథ రెడీ చేసే దర్శకుడే కావాలి! అంటూ ఆసక్తి కనబరచడం మెగాభిమానుల్లో చర్చకు వచ్చింది. అటు వరుణ్ తేజ్ కెరీర్ సాలిడ్ గా సాగిపోతోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. కమర్శియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ జోనర్ ని టచ్ చేస్తూనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. మరి సాయితేజ్ మాటలకు వరుణ్ తేజ్ ఏకీభవిస్తాడా?  లేదా?.. ఇంతకీ ఆ ఇద్దరి కోసం కథ తయారు చేసే దర్శక, రచయిత ఎవరు? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: