ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏం మాయచేసావే’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించారు. తెలుగు లో ఈ మూవీ మంచి హిట్ కావడంతో సమంతకు వరుస ఛాన్సులు వచ్చాయి. అదృష్టం కలిసి వచ్చి నటించిన అన్ని సినిమాలు మంచి హిట్ కావడంతో తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది. ఏం మాయ చేసావ సినిమలో నటించిన అక్కినేని నాగ చైతన్యతో రియల్ లైఫ్ లో లవ్ లో పడింది. పెద్దలను ఒప్పించి రెండు సాంప్రదాయల ప్రకారం వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత సమంత సినిమాల్లో నటించదని అప్పట్లో పుకార్లు వచ్చాయి. కానీ వివాహం జరిగిన మూడు నెలల తర్వాత సమంత నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకుంటున్నాయి.
ఆ మద్య నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉన్న సమంత తాజాగా తన ఫ్రెండ్ రమ్యా సుబ్రమణియన్తో కలిసి శ్రీవారిని దర్శించుకుంది. సమంత ప్రస్తుతం శర్వానంద్తో 96 రీమేక్ చిత్రం చేస్తుంది. దీంతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. షూటింగ్స్ కి కాస్త విశ్రాంతి ఇచ్చిన తన స్నేహితురాలితో శ్రీవారి దర్శనం చేసుకుంది. కాలి నడకన తిరమలకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలుస్తుంది. రమ్య తన ఇన్స్టాగ్రామ్లో సమంతతో దిగిన ఫోటోలు షేర్ చేయడంతో అవి వైరల్గా మారాయి.
రమ్య తన కెరీర్ని యాంకర్గా ప్రారంభించగా, ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. ఆ మద్య మజిలీ సినిమా రిలీజ్ సందర్భంగా తన చిత్ర యూనిట్ తో కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత ఈ మూవీ సూపర్ హిట్ కావడం జరింది. తాజాగా సామాన్య భక్తులతో కలిసి సమంత ఏడు కొండలు ఎక్కారు. మధ్య మధ్యలో అభిమానులతో సెల్ఫీలు దిగారు. కేవలం రెండు గంటలలోనే సమంత తిరుమల కొండకు చేరుకుంది. చైతూ, బ్రహ్మానందం కారులో తిరుమల కొండకి వెళ్ళారు.