ఒకప్పుడు కొత్త వారు, ఫేమ్ లేని వారు మాత్రమే వెబ్ సిరీస్ లలో నటించేవారు. కాని కియారా అద్వాని, రాధికా ఆప్టే పుణ్యమా అని ఇప్పుడు స్టార్స్ తో పాటు సూపర్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు. సినిమాల స్థాయి లో వెబ్ సిరీస్ లను చేస్తున్నారు. దాంతో స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక సినిమాల్లో ఛాన్స్ లేని హీరోయిన్స్ మాత్రమే కాదు నటులకు వెబ్ సిరీస్ లు ఒక వరంగా మారాయి. పలువురు హీరోయిన్స్ వెబ్ సిరీస్ బాట పడుతున్నారు. అందులోను బోల్డ్ కంటెంట్ అయితే ఇంకా బెస్ట్ అని రెడీ అవుతున్నారు. ఎందుకంటే వాటిని చూడటానికి జనాలు బాగా వెంపర్లాడుతున్నారు. వీళ్ళకి చూపించడానికి స్కోప్ ఎక్కువగా. సినిమాలలో అయితే సెన్సార్ సమస్యలు. ఇక్కడ అయితే ఎటువంటి సమస్యా లేదు. అన్ని విధాలుగా పర్‌ఫార్‌మెన్స్ కి స్కోప్ ఉంటుంది. దాంతో దర్శక, నిర్మాతల దగ్గర ఎంత కావాలన్నా డిమాండ్ చేయొచ్చు. అందుకే టాప్ హీరోయిన్స్, ఫేమస్ యాక్టర్స్ అందరు ముందు వెబ్ సిరీస్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 

 

ఇక ప్రస్తుతం అక్కినేని సమంత కూడా ఒక వెబ్ సిరీస్ ను చేస్తున్న విషయం తెల్సిందే. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా వెబ్ సిరీస్ ను చేస్తోంది. ఇక వీరి జాబితాలో హాట్ బ్యూటి, కిస్సుల కుమారి హెబ్బా పటేల్ కూడా చేరింది. కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారి గా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ గ్లామర్ డాల్ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా కూడా పెద్దగా సక్సెస్ లు దక్కించుకోలేక పోయింది. అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటి ప్రస్తుతం నితిన్ సినిమాలో నటిస్తుంది.

 

ఒక వైపు హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ ను చేసేందుకు కమిట్ అయ్యింది. అజయ్ భుయాన్ దర్శకత్వంలో రూపొందబోతున్న వెబ్ సిరీస్ తో హెబ్బా పటేల్ తన కొత్త జర్నీని ప్రారంభించబోతుంది. హీరోయిన్ గా వెండి తెరపై కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయిన హెబ్బా వెబ్ సిరీస్ లతో అయినా అబ్బా అనిపించుకొని సక్సెస్ ను దక్కించుకుంటుందేమో చూడాలి. ఇక స్కిన్ షో కి లిప్ లాక్స్ కి ఏమాత్రం అడ్డు చెప్పని హెబ్బా వెబ్ సిరీస్ లో రెచ్చిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక లాస్ట్ సినిమా 24 కిసెస్ లో హెబ్బా అన్ని ముద్దులు పెట్టినా ఎవరికి రుచించలేదన్న విషయం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: