ఏంటి పందెంకోళ్లు ఎవరు అనుకుంటున్నారా అదేనండి మన బన్నీ -మహేష్ బాబు... సంక్రాంతి భరిలో రెండు  పెద్ద భారీ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. ఆ సినిమాల రిలేజ్ కోసం అటు అల్లుఅర్జున్ ఫ్యాన్స్, ఈటు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..

 

ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం కూడా బానే జరుగుతుంది.. జనవరి 11న మహేష్ బాబు నటించిన "సరిలేరు నీకెవ్వరూ"సినిమా రిలీజ్ కానుంది. అలాగే జనవరి 12 న అల్లు అర్జున్ నటించిన "అలా వైకుంఠపురం"సినిమా రిలీజ్ కానుంది... ఒక్క రోజు గ్యాప్ తో రెండు సినిమాలు థియేటర్లో సందడి చేయనున్నాయి..

 


అయితే ఎవరికీ ఎవరు వల్ల ప్లాన్స్ తో సినిమాకి పబ్లిసిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.ప్రమోషన్ లో భాగంగా, ప్రీరిలీజ్ వేదికల విషయంలోనూ, ఒకరితో ఒకరు పోటీపడబోతున్నారని తెలుస్తుంది.. మహేష్ బాబు -అనీల్ రావిపూడి బృందo ఎప్పటికి మెగా స్టార్ చిరంజీవిని మరియి రాంచరణ్ తేజ్ ని లాక్ చేసినట్లు సమాచారం.. వీరు ఇరువురులో ఎవరో ఒకరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి హాజరు అవుతున్నట్లు సమాచారం...

 

మరి బన్నీ ఏమి ఎలా ఈవెంట్ ని ప్లాన్ చేస్తాడో అని అందరిలో ఆత్రుత మొదలయింది.. బన్నీ "సరిలేరు నీకెవ్వరూ" ఈవెంట్ ఫంక్షన్ తర్వాత... అలా వైకుంఠ పురం ఈవెంట్ ఫంక్షన్ చేయబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ ని రంగం లోకి దింపనునట్లు సమాచారం..

 

అభిమానులుకి ఈ విషయం మరింత ఉత్సహాన్ని ఇస్తుంది .. జూనియర్ ఎన్టీఆర్ అంతకముందు మహేష్ బాబు నటించిన "భరత్ అను నేను"సినిమా ఈవెంట్ ఫంక్షన్ కి వచ్చారు.. ఈసారి అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్ కి రాబోతున్నట్లు సమాచారం.. ఇప్పటికే అతిధులకు ఆహ్వానాలు అందాయిట. మరోవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్న తారక్- చరణ్ ఇద్దరినీ ఆ ఇద్దరూ లాక్ చేసేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. చెరో గెస్ట్ ని లాక్కుంటున్నారు... ప్రీ రెలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారు మన స్టార్స్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: