యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా మారుతి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ప్రతి రోజు పండగే.. ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా మెగా అభిమానుల కోసం ఈ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేసింది.. ఉమ్మడి కుటుంబం లో ఉంటే ప్రతి రోజు పండగే అనే నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో కొన్ని ఎలివెంట్స్ జనాలను ఆట్టుకొలేక పోయిందని టాక్..


 సినిమా విషయానికొస్తే..హీరో తాత సత్యరాజ్ ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతూ ఉంటాడు అతని జీవితంలో చివరి రోజుల్లో హ్యాపీగా ఉంచేందుకు సాయి ధరంతేజ్ అమెరికా నుంచి రాజమండ్రి వస్తాడు
జబర్దస్త్ మహేష్ సత్య రాజు దగ్గర పనిచేసే మనిషి ఫస్టాఫ్ లోనే రాసి తేజ్ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్లు బాగుంటాయి వాళ్ళిద్దరి పెళ్లి పనులు కూడా మొదలవుతాయి ఈలోగా సినిమా హాస్పిటల్ సీన్ కు చేరుతుంది సత్యరాజ్ ఆరోగ్యం మరింత విషమిస్తుంది

 

ఫ‌స్టాఫ్ రిపోర్ట్‌: ఊహించదగ్గ కథనంతో ఒకే అని చెప్పొచ్చు.కొన్ని ఫ్యామిలీ ఫన్నీ సీన్స్ మినహా ఇంకా అంత గొప్ప అంశాలు ఏమీ కనిపించలేదు.మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి. మొదట్లోనే సినిమా స్థాయి తెలిసేలా ఉందని జనాలు అంటున్నారు.. సాగదిసారని మాటలు వినపడుతున్నయి.. కథలో కొత్తదనం లేకపోయినా కూడా కామెడీని బాగానే పండించారు..కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడమనేది ఈ సినిమాకు కలిసి రావొచ్చు..

 

సెకండాఫ్ రిపోర్ట్‌: సెకండాఫ్లో సినిమా ఆశించినట్లుగా లేదు. సాయి తేజ్ రాశి మధ్య కొన్ని కామెడీ సీన్లు అక్కడి నుంచి సినిమా ఎమోషనల్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. మళ్లీ హాస్పిటల్ కు సంబంధించిన సీన్ల‌తో ఎమోషన్ ఓవర్ డోస్ అయింది. క్లైమాక్స్‌లో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఓవ‌రాల్‌గా సినిమా మొత్తం మీద రెండు మూడు సీన్ల‌కే పండ‌గా అన్న‌ట్టుగా ఉంది. హిట్ అవుతుందని కొందరు మాత్రమే అంటుండడంతో తేజ్ సినిమాల పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందని అంటున్నారు..చూడాలి ఈ మాత్రం ఆకట్టుకుంటుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: