‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ కు బాలీవుడ్ నుండి ఎన్నోఆఫర్లు వచ్చాయి. అయితే ఆ ఆఫర్స్ అన్నీపక్కకు పెట్టి ప్రభాస్ తనదృష్టిని పూర్తిగా ‘సాహో’ పైనే పెట్టాడు. అయితే ‘సాహో’ పరాజయం చెందినా ఆవిషయాన్ని పట్టించుకోకుండా ప్రభాస్ కు మళ్ళీ అనేకప్రముఖ బాలీవుడ్ నిర్మాణసంస్థల నుండి భారీ ఆఫర్స్ వచ్చాయి.

అయితే ఈఆఫర్స్ ను కూడ పట్టించుకోకుండా ప్రభాస్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘జాను’ పైనే దృష్టి పెడుతూ ఈసినిమా విడుదల అయ్యేంతవరకు మరో సినిమా ప్రాజెక్ట్ ను బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ చేయకూడదు అన్న ఉద్దేశ్యంతో ప్రభాస్ తన దృష్టి అంతా జిల్ రాధాకృష్ణ తీస్తున్న సినిమా పైనే కొనసాగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ తిరస్కరించిన అవకాశాన్ని ఇప్పుడు విజయ్ దేవరకొండ సద్వినియోగపరుచుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం విజయ్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఫైటర్’ మూవీని హిందీలో కూడ కరణ్ జోహార్ సహకారంతో భారీ స్థాయిలో బాలీవుడ్ లో కూడ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే పూరీ కరణ్ జోహార్ ల మధ్య ఈ మూవీ విషయమై ఒక అంగీకారం కుదరడంతో విజయ్ దేవరకొండ పేరు బాలీవుడ్ లో కూడ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విషయం ఇలా కొనసాగుతూ ఉంటే ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ దృష్టి విజయ్ దేవరకొండ పై పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’ మూవీగా రీమేక్ చేయబడి బాలీవుడ్ లో విడుదలై ఘనవిజయం సాధించడంతో ఆరీమేక్ లో విజయ్ నటించకపోయినా విజయ్ దేవరకొండ గురించి బాలీవుడ్ మీడియా అనేకవార్తలు వ్రాసింది. దీనికితోడు విజయ్ తో కరణ్ జోహార్ ఫైటర్ మూవీని పూరీతో కలిసి నిర్మిస్తున్న నేపధ్యంలో ఆమూవీ ఇంకా మొదలు కాకుండానే యష్ రాజ్ ఫిలిమ్స్ విజయ్ తో మూడు సినిమాలు తీయడానికి సంబంధించి ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ విజయ్ కు 48 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ఆఫర్లు ప్రభాస్ కు బాలీవుడ్ నిర్మాణ సంస్థల నుండి వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించాడు. దీనితో  విజయ్ ప్రభాస్ మార్గాన్ని అనుసరించి యష్ రాజ్ ఫిలిమ్స్ ఆఫర్ ను తిరస్కరిస్తాడా లేదంటే ప్రభాస్ కంటే ముందుగానే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా అన్న విషయమై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: