నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా అంటే ఆ అంచనాలు వేరేలా ఉంటాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలకృష్ణకు సిం హాతో సూపర్ హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. ఇక ఆ సినిమా తర్వాత లెజెండ్ అంటూ మరో హిట్ అందించాడు. బాలయ్యను ఎలా వాడుకోవాలో బోయపాటికి తెలిసినంతగా ఎవరికి తెలియదని చెప్పాలి. ఇక లేటెస్ట్ గా కె.ఎస్ రవికుమార్ రూలర్ తో మరోసారి బాలయ్య నిరాశపరచాడని అంటున్నారు.

 

జై సిం హా తర్వాత కె.ఎస్ రవికుమార్ తో బాలకృష్ణ మరో సినిమా చేశారు. జై సింహా కూడా పర్వాలేదు అనిపించుకుందే తప్ప సూపర్ హిట్ అవలేదు. అలాటిది మళ్లీ ఈ కాంబో సినిమా అనగానే నందమూరి ఫ్యాన్స్ లో కూడా డౌట్ మొదలైంది. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత రూలర్ రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్ అని ఫిక్స్ అయ్యారు. ఈరోజు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీమియర్స్ టాకే దారుణంగా వస్తుంది.    

 

బాలకృష్ణ ఇలాంటి సినిమాలు ఇక చేయడం మానేస్తే బెటర్ అని సలహా ఇస్తున్నారు. అయితే బాలయ్యను కాపాడాలి అంటే అది బోయపాటి శ్రీను వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సింహా, లెజెండ్ సినిమాలతో వాళ్లిద్దరికి అలా సింక్ అయ్యింది. రూలర్ తర్వాత బాలయ్య బాబు మరోసారి బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నాడు. హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాపైనే నందమూరి ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు.

 

రూలర్ రిజల్ట్ ముందే ఊహించినట్టుగా తెలుస్తుంది. అందుకే సినిమాకు పెద్దగా హడావిడి చేయలేదు. అంతేకాదు రూలర్ బిజినెస్ కూడా చాలా డల్ గా చేసింది. కథల విషయంలో బాలకృష్ణ మరోసారి ఆలోచించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎన్.టి.ఆర్ బయోపిక్ రెండు పార్టులతో పాటుగా రూలర్ కూడా నిరుత్సాపరచేలా ఉండటంతో బోయపాటి శ్రీను సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు బాలకృష్ణ.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: