బాలకృష్ణ, సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రూలర్.. ఇక గతంలో బాలయ్య హీరోగా నటించిన జైసింహా సినిమాకు దర్శకత్వం వహించిన కేయస్ రవికుమార్ దర్శకత్వం లో, ఈ సినిమాను సీ కళ్యాణ్‌ నిర్మిస్తుండగా, ఇతర ముఖ్యపాత్రల్లో  జయసుధ, భూమిక, ప్రకాష్ రాజ్‌, శియాజీ షిండేలు నటిస్తున్నారు. ఇకపోతే  డిసెంబర్ 20వ తేదీన  ఈ సినిమా ప్రపంవ వ్యాప్తంగా విడుదల అయ్యింది.

 

 

ఇదిలా ఉండగా రూలర్ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తున్నారట.  అందులో ఒకటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్ర కాగా, రెండోది పోలీస్ ఆఫీసర్ రోల్.  ఈ రెండు పాత్రల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్ర కొత్తగా ఉంటుందని వినికిడి. ఇకపోతే రూల‌ర్‌లో బాల‌య్య ఇండియాలోనే నెంబ‌ర్ వ‌న్ సీఈఓగా క‌నిపించ‌బోతున్నాడట. మ‌రో పాత్రలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడట. అయితే.. ఈ క‌థ‌లో కొన్ని గ‌జిని సినిమా తాలూకూ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని అభిమానులు నిరాశ చెందుతున్నారట..

 

 

ఇక ఇదేగాకుండా కొంత‌మంది సీఈఓ గా ఉన్న బాలయ్యని చంపాల‌ని ప్ర‌య‌త్నించ‌డం, ఆ క్రమంలో మన నటసింహం బాలయ్య బాబు గ‌తాన్ని మ‌ర్చిపోవ‌డం క‌థ‌లో కీల‌క‌మైన అంశ‌మ‌ట‌. ఇకపోతే బాల‌య్య గ‌తం మ‌ర్చిపోవ‌డం ఇదేం కొత్త కాదు. గ‌తంలో ల‌య‌న్‌లోనూ గతాన్ని మరిచిపోయి. ఆ సినిమాను ప్రేక్షకులు మరిచేలా చేశారు. ఇప్పుడు మరో సారి మరవడం అనే పాయింట్‌తో రూలర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానుల్ని మురిపిస్తాడో లేక లయన్ లా రూలర్ ను కూడా రెండు రోజుల్లో మరిచేలా చేస్తాడో అని బాలయ్య అభిమానులు బెంగతో టెన్షన్ పడుతున్నారట..

 

 

ఇకపోతే ఎన్నో మంచి మంచి కధలను వెలికి తీసే కదా రచయితలున్న ఈ జన్‌రేషన్‌లో ఎప్పుడో అరిగి, కరిగి, పోయిన కధలతో, అభిమానుల ప్రేమాభిమానాలను పరీక్షించడం భావ్యమా అని కొందరు తమ మనసులో అనుకుంటున్నారట.. ఇకపోతే ఈ చిత్రాన్ని ధియోటర్లో ప్రేక్షకులు పడుకోపెడతారో లేక, పరిగెత్తేలా చేస్తారో తెలియాలంటే కాస్త సమయం వరకు ఆగితే పోలా అనుకుంటున్నారట సినీ ప్రేక్షకులు..  

మరింత సమాచారం తెలుసుకోండి: