మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్- మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా సినిమా `ప్రతీరోజూ పండగే` నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. గ్రామీణ నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్గా నటించింది. ఇక ఇప్పటికే విదేశాల్లో, దేశంలో పలు చోట్ల ప్రీమియర్స్ ప్రదర్శించారు. ‘చిత్రలహరి’ లాంటి డీసెంట్ హిట్ తరవాత సాయి తేజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘ప్రతిరోజూ పండగే’పై అంచనాలు ఏర్పడ్డాయి.
దీనికి తోడు ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు చిత్ర యూనిట్. ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రతి రోజు పండగే సినిమాను దర్శకుడు మారుతి ఫస్టాఫ్ అంతా ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా మలిచాడు. ఫస్టాఫ్ లో లంగ్ కాన్సర్ తో బాధపడుతున్న సత్య రాజును చివరి రోజుల్లో ఆనందంగా ఉంచేందుకు అమెరికా నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ చేసిన అల్లరి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే హీరోయిన్ రాశి ఖన్నాతో ప్రేమ సన్నివేశాలు.. పెళ్లి సన్నివేశాలు సూపర్ గా ఉంటాయి.
ఇక తాత కోసం కుటుంబాన్ని అంతా ఒకచోట చేర్చేందుకు సాయిధరమ్ చేసే ప్రయత్నాలతో సినిమా అంతా అందమైన కుటుంబ వాతావరణంలో నడుస్తుంది. అలాగే సినిమాలో ఎమోషన్స్ బాగానే వర్క్ అవుట్ అయినా మారుతి మార్క్ కామెడీ మాత్రం మిస్ అయ్యిందని చెప్పాలి. ఇక సినిమా ఫస్టాప్లో మాత్రం ప్రేక్షకులకు సంక్రాంత్రి సినిమా గర్తుకు వస్తుంది. ఎందుకంటే.. సంక్రాంతి సినిమాలాగానే.. ప్రతిరోజూ పండగే ఎంటర్టైనింగ్ ఫస్టాఫ్, సెంటిమెంటల్ సెకండాఫ్తో నిండి ఉంటుంది. మరి యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎంత వరకు హిట్ అవుతుందో చూడాలి.