నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ హీరోగా సీకే ఎంటర్టైన్మెంట్స్, హ్యాపి మూవీస్ బ్యానర్స్ పై నిర్మాత సి.కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రూలర్ సినిమా నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గతేడాది బాలకృష్ణకు జై సింహా వంటి మంచి సక్సెస్ ని అందించిన దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ రూలర్ మూవీపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవటంలో చాలావరకు విఫలం అయినట్లు తెలుస్తోంది. 

 

సినిమా చూస్తుంటే దర్శకుడు రవికుమార్ కేవలం బాలయ్య ఫ్యాన్స్ కోసమే దీన్ని తెరకెక్కించారు అనే అనుమానం ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కలుగుతుందని మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.  ఫక్తు రొటీన్ కథని ఎంచుకున్న దర్శకుడు కె.ఎస్ రవికుమార్, దానిని స్క్రీన్ పై ఆసక్తికరంగా చూపటంలో పూర్తిగా విఫలమయ్యా డని, అలానే సినిమాలోని చాలా సన్నివేశాలు ఎంతో బోరింగ్ గా ఉంటాయని, ఇక అర్థం పర్థం లేని ఫైట్స్, సాధారణ ప్రేక్షకుడికి మరింత ఇబ్బందికరంగా మారుతాయని అంటున్న వారు కూడా ఉన్నారు. 

 

ఓవరాల్ గా చూసుకుంటే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక ఫెయిల్యూర్ గా మిగిలిపోవడానికి చాలా వరకు అవకాశం ఉందని అంటున్న వారు కూడా లేకపోలేదు. గతంలో బాలయ్య, కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన జైసింహా సినిమానే బాగుందని, మరీ ఇంత అర్థంపర్థం లేకుండా రవికుమార్ గారు ఈ సినిమా తీస్తారని మేము అనుకోలేదని కొందరు ప్రేక్షకులు బహిరంగంగానే చెప్తున్నారు. తొలి రోజే ఈ విధమైన టాక్ ని సంపాదించుకున్న రూలర్ సినిమా, మున్ముందు ఏ విధమైన టాక్ తో ఎంత మేర కలెక్షన్ తో ముందుకు సాగుతుందో చూడాలి....!!!.

మరింత సమాచారం తెలుసుకోండి: