మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రలహరి సినిమా మంచి సక్సెస్ సాధించి, అప్పటి వరకు వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటున్న సాయి ధరమ్ తేజ్ కు మంచి బ్రేక్ నిచ్చింది. ఇక ప్రస్తుతం సాయి తేజ్, మారుతి దర్శకత్వంలో ప్రతిరోజు పండగే అనే సినిమాలో హీరోగా నటించారు. సాయి తేజ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ సంగీత తరంగం ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాను యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లపై యువ నిర్మాత బన్నీవాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 

 

ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి స్పందన రాబడుతోంది. ముఖ్యంగా సినిమాలు ట్రాజెడీ డైలాగులను పండించడంలో పేరున్న నటుడు రావు రమేష్, కామెడీని బాగా పండించారు అని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రావు రమేష్ డైలాగ్ చెప్పటం లో తన తండ్రి రావుగోపాలరావు మించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు, రావు గోపాల్ రావు విలన్ గా చేసిన కమెడియన్ గా చేసిన తండ్రిగా చేసిన మామ గా చేసిన చెప్పే డైలాగులకు స్పెషాలిటీ ఉండేది, ఇప్పుడు రావు రమేష్ సైతం తండ్రిగా అన్నగా మామగా విలన్ గా చాలాసార్లు మెప్పించాడు, అయితే ఈ సినిమాలో అందుకు భిన్నంగా మారుతి, రావు రమేష్ పై కామెడీ ట్రాక్ నడిపించి సక్సెస్ అయ్యాడని అంటున్నారు. 

 

సినిమాలో కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ సీన్స్ బాగున్నాయని, ఇక కీలక ఎమోషనల్ సీన్స్ ని కూడా దర్శకుడు మారుతి బాగా తీశారని అంటున్నారు. ముఖ్యంగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ రాశి ఖన్నా ల మధ్య వచ్చే రొమాంటిక్, మరియు ఫన్నీ సీన్స్ బాగున్నాయట. ఇక సీనియర్ నటుడు సత్యరాజ్ తన క్యారెక్టర్ లో అద్భుతంగా యాక్ట్ చేశారు అని ఉంటున్నారు. సినిమాలో కామెడీ, ఫైట్స్, యాక్షన్, విజువల్స్, సాంగ్స్ వంటి అంశాలు బాగానే ఉన్నా, ట్రాజెడీ మరియు ఎమోషనల్ సీన్స్ అసలు పండలేదని అంటున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా ఒక యావరేజ్ గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు దీన్ని బట్టి తెలుస్తోంది. మరి ప్రస్తుతం రిలీజైన సినిమాల పోటీని తట్టుకుని ప్రతి రోజు పండుగ ఎంత మేడం కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్తుంది అనేది తెలియాలంటే మరి కొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: