నేడు విడుదలైన ‘రూలర్’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ తాను త్వరలో దర్శకుడుగా మారబోతున్న విషయానికి సంబంధించి లీకులు ఇచ్చాడు. చాల సంవత్సరాల క్రితం బాలకృష్ణ దర్శకుడుగా మారి ‘విరాట పర్వం’ అన్న మూవీని మొదలు పెట్టి కొన్ని రోజులు షూటింగ్ కూడ చేసాడు.

అయితే ఆ మూవీలో ద్రౌపది పాత్రలో నటిస్తున్న అప్పటి క్రేజీ హీరోయిన్ సౌందర్య మరణించడంతో ఆ ప్రాజెక్ట్ ను అప్పట్లో మధ్యలో ఆపివేసాడు బాలయ్య. ఇలాంటి పరిస్థితులలో గతంలో తనకు ఎంతో పేరు తీసుకు వచ్చిన ‘ఆదిత్య 369’ మూవీకి సీక్వెల్ చేయాలని ఇప్పుడు మళ్ళీ బాలయ్యకు ఆలోచనలు మొదలైనట్లు అతడి మాటలను బట్టి అర్ధం అవుతోంది.

వాస్తవానికి ఈ సీక్వెల్ బాలయ్యతో తీయడానికి సింగీతం శ్రీనివాస రావ్ ఆసక్తి కనపరుస్తున్నా ఇప్పటికే కొంతవరకు స్క్రిప్ట్ రెడీ అయిన ఈ మూవీకి తానే దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి అంటూ బాలయ్య మాటలలో అర్ధాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సీక్వెల్ లో బాలయ్యతోపాటు మోక్షజ్ఞ నటిస్తే బాగుంటుంది అంటూ ఇప్పటికే అనేకసార్లు బాలయ్య అభిమానుల నుండి విన్నపాలు వస్తున్నాయి. 

అయితే మోక్షజ్ఞ తన మనసు మార్చుకుని ఎప్పుడు సినిమాలకి వస్తాడు అన్నది తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో మళ్ళీ ఈ సీక్వెల్ వార్తలు బయటకు రావడంతో ఈ మూవీలో కూడ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తాడా లేకుంటే మరెవరైనా ఈ మూవీలో యంగ్ బాలయ్య స్థానంలో నటిస్తారా అన్న విషయం ఫై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే ఈ మూవీకి బాలయ్య దర్శకుడుగా మారడమే లేటెస్ట్ ట్విస్ట్. దీనితో ప్రస్తుత తరం టాప్ దర్శకుల పై బాలయ్యకు నమ్మకం తగ్గిందా అని అనిపించడం సహజం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ బాలయ్య బోయపాటిల మూవీ ప్రాజెక్ట్ పూర్తి అయిన తరువాత సెట్స్ పైకి వచ్చే ఆస్కారం ఉంది.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: