నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చిరంతన్‌ భట్ సంగీతం అందించాడు. అయితే బాలయ్య బాబు సినిమా ఈరోజు విడుదల అయ్యింది. 

                                   

ఈ సినిమాఫై ఎన్నో అంచనాలు పెట్టుకొని బాలయ్య బాబు సినిమాను చూడటానికి వెళ్లిన అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.. ఒక్కో డైలాగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ మాములు ఎంజాయ్ కాదు. ఓ రేంజ్ లో చేస్తున్నారు. కొన్ని డైలాగ్ లకు నవ్వుకున్న మరికొన్ని డైలాగ్ లను ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. 

                                       

ఇంకా సినిమాలో వచ్చిన ఓ డైలాగ్ కి అయితే అరుపులు.. కేకేలు.. ఈలలు వేశారు. అంతటి అద్భుతమైన డైలాగ్ ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి బాబు.. ''ఆ తెలుగు రైతులు రోడ్డు మీద పోరాటం చేస్తే దేశ‌మే మా వైపు చూస్తుంది డైలాగ్‌'' అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఆ డైలాగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. కాగా బాలయ్య ఈ సినిమాకు మిశ్రమ స్పందనే వచ్చింది. ఈ సంవత్సరం బాలయ్యకు కలిసి రాలేదు అని చెప్పచు. సంవత్సరంలో మొదటి నెల ఎంత నిరాశకు గురయ్యారో ఇప్పుడు కూడా అంతే నిరాశకు గురయ్యారు బాలయ్య బాబు. 

మరింత సమాచారం తెలుసుకోండి: