నట సింహం నందమూరి బాలకృష్ణ  నటించిన రూలర్,  మెగా హీరో సాయి తేజ్ నటించిన ప్రతిరోజు పండగే  ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పోటాపోటీగా బరిలోకి దిగిన ఈ రెండు సినిమాల్లో విజేత ఎవరా అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక థియటర్ దగ్గర ఇప్ప్పటికే సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ రెండు సినిమాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. 

బాలకృష్ణ హీరోగా దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌.  ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ రోజు విడుదలైన ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే...? ఇప్పటి వరకు సినిమాకు డివైడ్‌ టాక్‌ వస్తోంది. అభిమానులు బాలయ్య ఎనర్జీ సూపర్‌ అంటుంటే ఇతర ప్రేక్షకులు నెగెటివ్‌ రిపోర్ట్ ఇస్తున్నారు. సినిమాలో బాలయ్య ఎలివేషన్‌ సీన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ సూపర్‌ అంటున్నారు ఫ్యాన్స్‌. తొలిభాగం ఎంటర్‌టైనింగ్‌గా సాగినా సెకండ్‌ హాఫ్‌లో మాత్రం దర్శకుడు నిరాశపరిచాడన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా రొటీన్‌ స్టోరి, టేకింగ్‌లతో బోర్‌ కొట్టించాడట. లెంగ్తీ సీన్స్ కూడా సెకండ్‌ హాఫ్‌లో ఆడియన్స్‌ను ఇబ్బంది పెడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలయ్య ఎనర్జీ తప్ప సినిమాలో ఇంకేంలేదంటున్నారు ప్రేక్షకులు.ఇక  ప్రతిరోజు పండగే సినిమా ఎలా ఉందంటే.. మెగా మేనల్లుడు , సాయి తేజ్, బ్యూటీ ఫుల్ రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ప్రతిరోజు పండగే. ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహించాడు. మారుతి అనగానే అతని సింపుల్ బట్ ఎఫెక్టివ్ ఎంటర్టైనింగ్ సినిమాలే గుర్తొస్తాయి. మొదటి హాఫ్ ను ఎంటర్టైనింగ్ వే లోనే నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో ఒక స్టేజ్ వచ్చాక ఏం చేయాలో అర్ధం కానట్లు సినిమాను తీసుకెళ్లాడు. అటు కామెడీ వైపు వెళ్ళాలో, ఇటు సెంటిమెంటల్ గా సినిమాను ముందుకు తీసుకెళ్ళాలో తెలియక రెండిటికీ కాకుండా చేసేసాడు. ఏదేమైనా మొదటి హాఫ్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, సెకండ్ హాఫ్ లో కొంత భాగం మెప్పిస్తాయి. మొత్తంగా ప్రతిరోజూ పండగే.. ఊహించినంత రేంజ్ లో లేకపోయినా ఒకసారి చూడవచ్చు. మొత్తం మీద రెండు సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: