ఈ మద్య టాలీవుడ్ లోకి తమిళ, మళియాళ, కన్నడ భాషా హీరోయిన్లు వరుసగా వస్తున్నారు.  ఇక బాలీవుడ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  హీరోయిన్లు, ఐటమ్ సాంగ్స్ కి ఈ మద్య దర్శక, నిర్మాతలు బాలీవుడ్ భామలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు లో మాలీవుడ్ బ్యూటీలు తమ సత్తా చాటుతున్నారు.  నేను శైలజ, నేను లోకల్, మహానటి లాంటి సూపర్ హిట్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది కీర్తి సురేష్.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ‘ఫిదా’ మూవీలో తెలంగాణ యాసతో తెలుగు రాష్ట్ర ప్రజల మనసు దోచింది.  ఇదే క్రమంలో మాలీవుడ్ లో ప్రేమమ్ సినిమాతో తొలిపరిచయమైన మాలీవుడ్ భామ అనుపమా పరమేశ్వరన్. ఎలాంటి గ్లామర్ కి తావివ్వకుండా  తనదైన నటనతో ఆకట్టుకుంటుంది. 

 

 తెలుగు లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన అ ఆ సినిమాలో కీలక పాత్రలో నటించింది.  ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా ఛాన్సులు దక్కించుకుంది అనుపమ.  ధనుష్ హీరోగా  తమిళ సినిమా "కోడి"లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. 2017 హీరో రామ్ పోతినేని నటించిన  ‘ఉన్నది ఒకటే జిందగీ’ అనే సినిమాలో  నటించింది. ఇంకా ఈమె నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్తున్నది.   వచ్చిన అవకాశాలు వదులుకోకుండా సినిమాలు చేసుకుంటూనే పోతుంది. చెప్పుకోదగ్గ హిట్ పడకపోయిన నటన పరంగా విమర్శకులను సైతం మెప్పించింది.

 

నటనతో పాటు అనుపమ పాటలు కూడా బాగా పడుతుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోచాలా యాక్టీవ్ గా ఉంటుంది.  వల్గారిటీకి ఏమాత్రం తావు ఇవ్వకుండా తన అందచందాలతోనే మంత్రముగ్దులను చేస్తునన అనుపమా పరమేశ్వరన్ తాజాగా తన చిన్ననాటి ఫోటోలు పోస్ట్ చేస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.  తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: