మహేశ్ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారనే ఊగాహానాలు సినిమా టీమ్ ఫుల్ స్టాప్ పెట్టింది. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. దీనిని కన్ఫర్మ్ చేస్తూ మహేశ్ బాబు కూడా చిరంజీవికి కృతజ్ఞతలు చెప్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
#SarileruNeekevvaru pre-release event on JAN 5th! pic.twitter.com/cXkf1Wj1nG
— mahesh babu (@urstrulyMahesh) December 20, 2019
‘జనవరి 5న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే ప్రీరిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ వస్తున్నార’ని ప్రకటించింది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో, ప్రేక్షకాభిమానుల్లో సంచలనం రేపుతోంది. ఇప్పటి వరకూ మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ పలు సందర్భాల్లో కలవటం తప్ప ఆడియో ఈవెంట్లకు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు ముఖ్య అతిధిలుగా వెళ్లటం జరగలేదు. తొలిసారిగా ఓ గ్రాండ్ ఈవెంట్ కు అందునా మహేశ్ సినిమాకు మెగాస్టార్ ప్రత్యేకంగా రావటం విశేషమనే చెప్పాలి. ఈ వార్తతో అటు మహేశ్ అభిమానులు, ఇటు మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దం క్రితం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా జల్సాకు మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అప్పట్లో ఇదో సంచలనం. అంతకుముందు అర్జున్ సినిమా పైరసీ విషయంలో వరంగల్ లో జరిగిన ఘటనకు మహేశ్ కు పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చాడు. ఇటివల భరత్ అను నేను సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చాడు. తర్వాత ఓ స్టార్ హోటల్ లో వీరికి చరణ్ కూడా జత కలిశాడు. ఇప్పుడు ఏకంగా చరణ్, ఎన్టీఆర్ ఓ మల్టీస్టారర్ సినిమానే చేస్తున్నారు. ఇటువంటి ఆహ్లాదకర సంఘటనలతో టాలీవుడ్ లో మంచి సహృద్భావ వాతావరణం నెలకొందనే చెప్పాలి.
Adding Grace & Style to the first & biggest celebration of 2020 !!#MegaStarChiranjeevi gaaru 🤩 will be gracing #SarileruNeekevvaru Pre Release event on JAN 5th at LB Stadium 🏟 🔥
— AK Entertainments (@AKentsOfficial) December 20, 2019
Gear up for the #MegaSuperEvent 🤟#SarileruNeekevvaruOnJan11th pic.twitter.com/ljElIU9vqc